అక్టోబర్‌ 1వ తేదీన హైదరాబాద్‌లో వైశ్యగర్జన



అక్టోబర్‌ 1వ తేదీన హైదరాబాద్‌లో వైశ్యగర్జన


వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ

హైదరాబాద్, (గూడచారి ప్రతినిధి) : తెలంగాణలో తక్షణం వైశ్యకమిషన్‌ను ఏర్పాటు చేయాలని వైశ్య వికాస వేదిక ప్రభుత్వాన్ని కోరింది. వైశ్యుల ఆత్మగౌరవం హక్కుల సాధనకోసం వైశ్య వికాస వేదిక చైర్మన్‌ డా.కాచంసత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్టోబర్‌ 1వ తేదీన హైదరాబాద్‌లో వైశ్యగర్జన నిర్వహించనున్నట్లు  వైశ్య వికాస వేదిక చైర్మన్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి పలు డిమాండ్లను విన్నవించారు. ముఖ్యంగా ewsలో వర్గీకరణ తేవాలని వైశ్యకార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. విదేశీవిద్య సహాయనిధిని ఏర్పాటుచేసి వైశ్య విద్యార్థులకు తోడ్పాటు అందించాలని కోరారు. జనాభా దామాషా ప్రకారం రాజకీయాలలో వాటా కల్పించాలని వైశ్యబంధు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర కుటుంబసర్వే నివేదికలోని అగ్రవర్ణాల వివరాలు, జనసంఖ్య, గణాంకాలు ప్రకటించాలని కోరారు.














 

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్