Skip to main content

వైశ్య కార్పొరేషన్ విషయంలో ఏం జరుగుతుంది...?, రాష్ట్రస్థాయి సంస్థలు లేకుండా జేఏసీ ఏ విధంగా ఆవిర్భవించింది? - బల్లు చంద్రప్రకాష్ గుప్త






వైశ్య కార్పొరేషన్ విషయంలో ఏం జరుగుతుంది...?,
రాష్ట్రస్థాయి సంస్థలు లేకుండా జేఏసీ ఏ విధంగా ఆవిర్భవించింది? - బల్లు చంద్రప్రకాష్ గుప్త
సోషల్ మీడియా పోస్ట్ యదావిదంగా

వైశ్య సోదరులందరికీ విజ్ఞప్తి
******************

తెలంగాణలోని యావత్ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా వైశ్య కార్పొరేషన్...రాజకీయ అభివృద్ధి పై గమనించాల్సిన సమయం ఆసన్నమైనది. అసలు తెలంగాణ రాష్ట్రంలో వైశ్య కార్పొరేషన్ విషయంలో ఏం జరుగుతుంది...?, అన్న అంశంపై నిరుపేద వైశ్య సమాజం సర్వత్ర ఆసక్తి కనబరుస్తున్నారు. "ఎవరికి వారే యమునా తీరే" అన్న చందంగా వైశ్య కార్పొరేషన్ విషయంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. వైశ్య కార్పొరేషన్ సాధించాలన్న ఉద్దేశంతో అనేక రాష్ట్రస్థాయి సంస్థలు అనేక విధాల, రకరకాల కార్యాచరణ కార్యక్రమాలను తీసుకొని ముందుకు సాగుతున్న విషయం విధితమే... ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు గౌరిశెట్టి మునిందర్ అధ్యక్షులుగా జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆవిర్భవించిందని ఇటీవల ప్రకటించారు.
అయితే ఈ (జేఏసీ)లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగం, తెలంగాణ రాష్ట్ర ఆవోపా, వాసవి క్లబ్, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి, వైశ్య వికాస వేదిక, తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక, అంతర్జాతీయ 
వాసవి మహిళా సమాఖ్య, మహిళా సంఘాలు రాష్ట్ర యువజన సంఘాలు రాష్ట్ర స్థాయి ఇతర సేవా సంస్థలు ఉన్నాయా....?, మరి ఇటువంటి రాష్ట్రస్థాయి సంస్థలు లేకుండా జేఏసీ ఏ విధంగా ఆవిర్భవించింది ..?
రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లా కేంద్రంలో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో కాచం సత్యనారాయణ సారద్యంలో జరిగిన కార్యక్రమం దేనికి సంకేతం...?
వైశ్య కార్పొరేషన్ సాధనకై తెలంగాణ రాష్ట్రంలోని అనేక సంస్థలను కలుపుకొని ముందుకు సాగితే తప్ప ఎటువంటి అభివృద్ధి.. జరగదన్న విషయాన్ని నాయకులు గమనించాల్సిన అవసరం ఉంది. నాయకుల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఎవరికి వారే అన్న చందంగా వారి వారి కార్యక్రమాలను నిర్వహించుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అన్న వాస్తవాన్ని గుర్తించాలి... ఎవరికి వారే జాయింట్ యాక్షన్ కమిటీల పేరుతో జేఏసీలను ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటించుకుంటూ పోతే ఇంకా ప్రభుత్వ దృష్టిలో చులకన కావడం ఖాయం అన్న విషయాన్ని నాయకులు గుర్తించాలి. అందరూ సమిష్టిగా ముందుకు సాగితేనే వైశ్య కార్పొరేషన్, వైశ్య కమిషన్ తోపాటు ప్రయోజనాలు కలుగుతాయన్న విషయాన్ని గమనించి ముందుకు సాగితే వైశ్య జాతికి మంచిది....

Bcpguptha 
98491 81448

 

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్