Skip to main content

*తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ను అధికారంలోకి తేవాలి* - కేంద్రమంత్రి శోభా కరంద్లాజే-






 *తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ను అధికారంలోకి తేవాలి*


*ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ విఫలం*


*- కేంద్రమంత్రి శోభా కరంద్లాజే*


*నల్లగొండ నవంబర్​ 27*


తెలంగాణ ప్రజలంతా ఆలోచన చేసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తెలంగాణలో డబ్బులు ఇంజన్ సర్కార్ను అధికారంలోకి తీసుకురావాలని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే కోరారు. సోమవారం నల్గొండ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించిన బిజెపి ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్గౌడ్తో కలిసి ఆమె పాల్గొని ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు, విద్యార్థులు, మేధావులు, యువకులంతా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి చెంద లేదని, సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని, కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను సైతం తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలోని పల్లెలు, మునిసిపాలిటీలలో హరితహారం, గ్రామ పంచాయతీల అభివృద్ధి, పార్కుల ఆధునీకరణ, రోడ్ల విస్తరణతో పాటు అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం వేల కోట్ల నిధులు విడుదల చేసిందని సీఎం కేసీఆర్ ప్రజలకు మోసపూరిత మాటలు చెబుతూ పబ్బం గడుపుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన, ఫసల్ బీమా యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన, తోపాటు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులన్నీ కమిషన్లకే సరిపోవడంలేదని కేసీఆర్ కుటుంబం దోచుకుని దాచుకుంటుందని అన్నారు. నల్గొండ నుంచి బిజెపి అభ్యర్థిగా శ్రీనివాస్ గౌడ్ ను అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు తెలంగాణగా తీర్చిదిద్దామన్నారు. నల్గొండ బిజెపి అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈనెల 31 ఏదైనా జరిగే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలను ప్రజలంతా ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. నాలుగు దఫాలుగా నల్గొండలో గెలిపించినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత ఎన్నికల్లో ఓడిస్తే భువనగిరికి పారిపోయారని, ప్రస్తుతం కోట్ల పేరుతో మీ ముందుకు వస్తున్నారని వారికి గుణపాఠం చెప్పాలన్నారు. గత ఐదేళ్లుగా నల్గొండలో ఎమ్మెల్యేగా గెలిచి పనిచేస్తున్న కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. నల్గొండ నియోజకవర్గ సంపాదన దోచుకుని దాచుకుంటున్నారని ఆరోపించారు, కోమటిరెడ్డి భూపాల్ రెడ్డి నల్గొండ బిడ్డలు కాదని, ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి నల్గొండ సంపదను దోచుకుని ప్రజలను మోసం చేస్తున్నారన్నారు, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు ఉచిత హామీలను ప్రకటిస్తూ ఓట్లను దండుకుని కుట్ర చేస్తున్నాయన్నారు, టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, రేషన్ కార్డులు, మూడెకరాల భూమి, నిరుద్యోగుల భృతి నేటికీ అమలు కాలేదన్నారు. రాష్ట్రంలో అధికార మదంతో విర్ర వీగుతున్న కేసీఆర్ దొర అహంకారాన్ని పారదోలేందుకు బిజెపికి ఓటు వేసి గెలిపించాలన్నారు. రాష్ట్రంలో తెలంగాణ రాకముందు లిక్కర్ ఆదాయం ప్రస్తుతం 45 వేల కోట్లకు చేరిందని, తెలంగాణ రాష్ర్టం ప్రస్తుతం రూ. 5.50 లక్షల కోట్ల అప్పులు కూరుకుపోయిందన్నారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేశారని, నల్గొండ ప్రజలకు నీరందించే ఎస్ఎల్బీసీ, ఎంఆర్పీ, ప్రాజెక్టులను పూర్తి చేయలేదని ఆరోపించారు, కేసీఆర్ మాటలను మన నమ్మవద్దని, ఎన్నికల్లో కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, బండారు ప్రసాద్,పొతేపాక సాంబయ్య,భూపాల్ రెడ్డి,కంకణాల నాగిరెడ్డి పెరిక ముని కుమార్, దాసరి సాయి, చర్లపల్లి గణేష్,ఏరుకొండ హరి, దాసరి సాయి, తదితరులున్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్