Skip to main content

అభివృద్ది పేరుతో కమీషన్లు దండుకున్న కేసీఆర్ కుటుంబం - కేంద్ర సహాయ మంత్రి శోభా కరం



 తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి


 

అభివృద్ది పేరుతో కమీషన్లు దండుకున్న కేసీఆర్ కుటుంబం


- కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే


నల్లగొండ నవంబర్ 28


తెలంగాణ రాష్ర్టంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే కోరారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని 11వ వార్డు అర్భన్కాలనీతో పాటు వివిధ ప్రాంతాలలో నిర్వహించిన బిజెపి ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఎంతో మందికి కేంద్ర ప్రభుత్వం ఆసరగా నిలిచిందని, అన్ని రంగాల అభివృద్ధే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని, ప్రజలు ఉపయోగ పడే పథకాలను తెలంగాణ ప్రజలకు చేరవేడంలోరాష్ర్టం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్రం నిధులతోనే తెలంగాణలోని పల్లెలు, మునిసిపాలిటీలలో హరితహారం, గ్రామ పంచాయతీల అభివృద్ధి, పార్కుల ఆధునీకరణ, రోడ్ల విస్తరణతో పాటు అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం వేల కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు, రైతులకు, యువతకు, మహిళలకు, విద్యార్థులకు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం అభివృద్ధి పేరుతో కమిషన్ల పేరుతో దండుకున్నారని ఆరోపించారు. ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికలలో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణలో బీజేపీని అభివృద్ది తీసుకురావాలని, నరేంద్రమోడీ నాయకత్వంలో తెలంగాణను అభివృద్ది పథంలో తీసుకెళ్తామన్నారు. నల్గొండ బిజెపి అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈనెల 30 ఏదైనా జరిగే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలను ప్రజలంతా ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. స్థానికేతరులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, నల్గొండపై వారికి ప్రేమ లేదన్నారు. మున్సిపాలిటీతో పాటు, నల్గొండ, కనగల్, తిప్పర్తి మండలాలలో ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వచ్చిందని, బీసీ బిడ్డగా బీజేపీ అవకాశం కల్పించిందని, ప్రతి ఒక్కరూ కమలం పువ్వుకు ఓటేసి గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు.  


ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బండారు ప్రసాద్, డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, పొతేపాక సాంబయ్య, పట్టణ అధ్యక్షులు కంకణాల నాగిరెడ్డి, శక్తి కేంద్ర ఇన్చార్జి ఏరుకొండ హరి, భూత అధ్యక్షులు సోమగుని దినేష్ గౌడ్ అనిమల్ యాదగిరి కంకణాల ఆదిరెడ్డి, కౌన్సిలర్లు బొజ్జ నాగరాజు, దాసరి సాయి, పెరిక ముని కుమార్, దాసరి ప్రశాంత్ వరికుప్పల సాయి మల్లేష్ ఉపేందర్ రెడ్డి తదితరులున్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్