Skip to main content

ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ ప్రకారం డిసెంబర్ 31 లోగా వానాకాలం 2022-23 సీజన్ సి.ఎం.ఆర్ డెలివరీ పూర్తి చేయండి - అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్




ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ ప్రకారం డిసెంబర్ 31 లోగా వానాకాలం 2022-23 సీజన్ సి.ఎం.ఆర్ డెలివరీ పూర్తి చేసి ఎఫ్.సి.ఐ కి వెంటనే అప్పగించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె. శ్రీనివాస్ కోరారు.


 బుధవారం అదనపు కలెక్టర్ తన చాంబర్లో పౌరసరఫరాల అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వానాకాలం 2022-23 సీజన్లో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల సి.ఎం.అర్ డెలివరీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 2.78లక్షల మెట్రిక్ టన్నుల సి.ఎం.అర్(93 శాతం) మిల్లర్ లు డెలివరీ చేశారని,మిగిలిన 20 వేల మెట్రిక్ టన్నుల సి.ఎం.అర్ డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు

  వానాకాలం పూర్తి చేసిన మిల్లర్ లు యాసంగి 2022-23 సి ఎం.అర్.డెలివరీ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.యాసంగి 2022-23 సీజన్ కు సంబందించి 4.66 లక్షల మెట్రిక్ టన్నుల సి.ఎం.అర్.కు గాను ఇప్పటి వరకు 1.04 లక్షల మెట్రిక్ టన్నుల సి.ఎం.అర్.డెలివరీ చేశారని తెలిపారు.

ఈ విషయంలో జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లర్లను అప్రమత్తం చేస్తూ పౌరసరఫరాల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదే విధంగా రైస్ మిల్లర్ల వారిగా ఎన్ఫోర్స్మెంట్ టీం ల ద్వారా పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.


 ఈ సమావేశంలో డిఎస్ఓ వెంకటేశ్వర్లు, పౌసరఫరాల సంస్థ మేనేజర్ నాగేశ్వరావు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు ,పౌర సరఫరాల డి.టి.లు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్