Skip to main content

రాయలసీమలో వైసీపీని నేలకూల్చండి


 *రాయలసీమలో వైసీపీని నేలకూల్చండి*


*జగన్ ను ఓటు ఆయుధంతో అధ: పాతాళానికి తొక్కేయండి*


*నిర్భయంగా ఓటేయండి.. మీ వెనుక నేనుంటాను*


*పెద్దిరెడ్డి ఈ ప్రాంతాన్ని సామంతరాజులా రౌడీయిజంతో పాలిస్తున్నాడు*


*సంపద అంతా పెద్దిరెడ్డి కుటుంబం దగ్గరే ఉంది*


*పెద్దిరెడ్డి ప్రాంతంలోకి ఎవరూ వెళ్లినా, ప్రశ్నించినా ప్రాణాలు తీస్తున్నారు*


*కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలకు తగిన ప్రాధాన్యం*


*కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ' ప్రసాద్ ' స్కీం ద్వారా ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధి*

 

*రాజంపేట ప్రజాగళం సభలో ప్రసంగించిన  పవన్ కళ్యాణ్*


రాజంపేట నుంచి ప్రత్యేక ప్రతినిధి : రాయలసీమలోని ఓ ప్రాంతంలో ప్రజలంతా ఉపాధి కోసం బయట ప్రాంతాలకు, గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్తుంటే, ఇక్కడి డబ్బంతా ముగ్గురు దగ్గరే ఉండి పోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడు వద్దనే అది ఉండిపోయింది. వాళ్లు ఈ ప్రాంతాన్ని సామంతుల్లా పాలిస్తూ దోపిడీలకు, దౌర్జాన్యాలకు, రౌడీయిజానికి కేరాఫ్ చేశారు. వీళ్లను ఎవరూ ఏమీ అనకూడదు. కనీసం ఈ ప్రాంతంలోకి వచ్చినా దాడులు చేయిస్తార'ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. స్థానికంగా ఉండే డ్యాంలు కొట్టుకుపోతుంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలు లిక్కర్ మాఫియా నడిపిస్తున్నారు. రౌడీయిజం పెంచి పోషిస్తున్నారు. సామాన్యులు వీళ్లను ప్రశ్నిస్తే కొట్టడాలు, చంపడాలు వరకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాజంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు , మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్.బాల సుబ్రహ్మణ్యం తో కలిసి ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ "2022 నవంబరులో స్థానికంగా పడిన భారీ వర్షాలకు అన్నమయ్య డ్యాం నిండిపోతోందని ముందుగానే తెలిసినా, పై నుంచి హెచ్చరికలు ఉన్నా డ్యాంలోని నీరు కిందకు వదల్లేదు. దీనికి ప్రధాన కారణం వైసీపీ నాయకుల ఇసుక దోపిడీ. ఇసుకను వాహనాల్లో ఎత్తిపోసుకోవడానికి డ్యాం నుంచి సకాలంలో గేట్లు తెరవలేదు.  ఫలితంగా 39 మంది ప్రాణాలు పోయాయి. 9 గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. 3 వేల మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. వందలాది ఎకరాలు నాశనం అయ్యాయి. డ్యాం తెగిపడే విషయం అర్ధమై డ్యాం లష్కర్ రామయ్య  తాను చేయాల్సిన సాయం చేసి, అందరికీ ఫోన్లు చేసి చెప్పడంతో ఎన్నో ప్రాణాలను ఆయన కాపాడగలిగారు. అలాంటి గొప్ప పని చేసిన  రామయ్య ని జనసేన పార్టీ తరపున తగిన సాయం చేసి, గౌరవించుకున్నాం. అయితే నాయకుల ఇసుక దోపిడీని మాత్రం మరిచిపోలేం. అంతమందిని పొట్టపెట్టుకున్న వీరి ఇసుక దాహానికి ఓటుతోనే బుద్ధి చెప్పాలి. పెద్దిరెడ్డి ఈ ప్రాంతాన్ని రౌడీయిజానికి అడ్డా చేశారు. పెద్దిరెడ్డి ఇక్కడ స్థానిక యువతకు ఉపాధిని దూరం చేశాడు. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చింది లేదు. పైగా అమర్ రాజా లాంటి పరిశ్రమను వెళ్లగొట్టారు. ఈ ప్రాంతం ఆయన జాగీరులాగా వ్యవహరిస్తున్నారు. సభ పెట్టుకోవడానికి అంగళ్లు వచ్చిన  చంద్రబాబు మీద దాడి చేయించి, తిరిగి 5 కేసులు పెట్టించాడు.  పుంగనూరులో అడ్డగోలుగా మూడు పంచాయతీలను భయపెట్టి ఏకగ్రీవం చేసుకున్నారు. ఇసుక టిప్పర్ల మీద వీళ్ల పేరుంటే ఎవరూ ఆపడానికి లేదు. పులిచర్లలో ఓ సగటు మనిషి ప్రశ్నిస్తే అతడి రెండు చేతులు విరగ్గొట్టారు. మరో చోట దందా ఏంటని అడిగితే రెండు కాళ్ల నరికేశారు. ఏంటి వీళ్ల అరాచకం.. అసలు ఎందుకీ రౌడీయిజం. ఇలాంటి నాయకులను ఇంటికి పంపాలా లేదా..? మనం భయపడుతూ ఎంత కాలం బతకాలి..? వీళ్లకు ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్దిచెప్పే సమయం వచ్చేసింది.  కూటమి ప్రభుత్వం వస్తేనే శాంతి భద్రతలు చాలా బలంగా ఉంటాయి. సగటు మనిషికి రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడి యువత కోపం, కసి మనల్ని ఎవడైతే బాధ పెడుతున్నాడో వాళ్లమీద చూపించాలి.

ఆయన ప్రాంతానికి అమూల్ రాదు.. శ్రీజ డెయిరీని నాశనం చేశారు రూ.10 వేల కోట్ల జీఎస్టీని ప్రభుత్వానికి ఎగ్గొట్టిన వ్యక్తి పెద్దిరెడ్డి.. అతడి గుంపు. ఈ ప్రాంతానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫాక్షనిజం, రౌడీయిజం తీసుకొచ్చారు. ఈ రౌడీయిజం పోవాలి అంటే కూటమి రావాలి. ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలి. ఎన్నో వేల మందికి ఉపాధి చూపించే హెరిటేజ్ ను తీసేస్తానని చెప్పిన జగన్ అమూల్ ను తీసుకొచ్చాడు. రాష్ట్రమంతా అమలయ్యే అమూల్ పాలు పెద్దరెడ్డి ఇలాకాలో కనిపించవు. తన శివశక్తి డెయిరీ కోసం అమూల్ ఉండదు. గతంలో ఈ ప్రాంతంలో మహిళలతో నడిచే శ్రీజ డెయిరీ 5 వేల లీటర్ల పాలు సేకరించేది. దాన్ని రాకుండా చేశారు. శ్రీజ డెయిరీను ఈ ప్రాంతంలో నాశనం చేశారు. వీళ్ల జోలికి ఎవరు వచ్చినా వాళ్లని నాశనం చేసే ఆలోచన వీళ్లది. ఎంతకాలం వీరి దాష్టికాలను భరిస్తాం. అసలు ఈ ముఖ్యమంత్రికి క్లాస్ వార్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. 


*ప్రసాద్ స్కీంలో ఈ ప్రాంత అభివృద్ధి*


ప్రజలకు ఏ సమస్య వచ్చినా మీ గొంతునవుతా. అన్నమాచార్య, కన్నప్ప వంటి మహానుభావులు  తిరిగిన నేల ఇది. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చు. సోమశిల బ్యాక్ వాటర్ ను పర్యాటక ప్రాంతంగా, బౌద్దరామాలు, సిద్దవటం కోట, ఒంటిమిట్ట క్షేత్రం, నందలూరు సోమనాథ ఆలయం వంటి అన్ని ప్రాంతాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దవచ్చు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘‘ప్రసాద్’’ స్కీం ద్వారా ఈ ప్రాంతాలను కలిపే అద్భుత ప్రాంతాలకు చేయవచ్చు. దీన్ని ఈ ప్రాంతానికి తీసుకు రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. ప్రజల భవిష్యత్తు కోసం దశాబ్దంగా పోరాటం చేస్తున్నా. నాకు ఇదేమీ సులభంగా రాలేదు. కష్టపడ్డాను.

రాయలసీమలో కూడా వైసీపీని నేలకొరిగేలా చేస్తాం. మీరు ఎవరికీ, దేనికి భయపడకండి. మీరు నిర్భయంగా ఓటేయండి. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుపెట్టి కాపాడుకుంటా.  జగన్ ను మీరు వేసే ఓటు ద్వారా అధ:పాతాళానికి తొక్కిపడేయండి. కూటమి ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించండి. రాజంపేట ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా బాల సుబ్రమణ్యంకి ఓటు వేయండి’’ అని కోరారు.ఈ సభలో జనసేన పార్టీ నాయకులు సుంకర శ్రీనివాస్,  అతికారి దినేష్, శ్రీనివాస రాజు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్