ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీచేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన




 

       పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచే అని శెట్టి దూప్పలపల్లి గోదాంలో ఈవీఎంల రిసెప్షన్ కేంద్రంలో   ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూదాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన ఆదేశించారు.


        సోమవారం ఆమె  అనిశెట్టి దుప్పలపల్లిలోని పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేశారు.


        కౌంటింగ్ కేంద్రాల ఆవరణ మొత్తం పూర్తిస్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేయాలని, పోలీస్ సెక్యూరిటీ కి అవసరమైన వసతి ,షామియానాలు ఏర్పాటు చేయాలని, వర్షం వచ్చిన ఇబ్బంది కాకుండా అవసరమైనన్ని టార్పాలిన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈవీఎంలను స్వీకరించే సందర్భంలో సిబ్బందికి, సెక్టోరల్ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు. నల్గొండ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి భద్రపరిచే ఈవీఎంల స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఎన్నికల పరిశీలకులు వసతి ని పరిశీలించారు.


         పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమన్న తదితరులు ఉన్నారు

____________________________________

 జారీ చేసిన వారు సహయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్