ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీచేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన




 

       పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచే అని శెట్టి దూప్పలపల్లి గోదాంలో ఈవీఎంల రిసెప్షన్ కేంద్రంలో   ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూదాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన ఆదేశించారు.


        సోమవారం ఆమె  అనిశెట్టి దుప్పలపల్లిలోని పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేశారు.


        కౌంటింగ్ కేంద్రాల ఆవరణ మొత్తం పూర్తిస్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేయాలని, పోలీస్ సెక్యూరిటీ కి అవసరమైన వసతి ,షామియానాలు ఏర్పాటు చేయాలని, వర్షం వచ్చిన ఇబ్బంది కాకుండా అవసరమైనన్ని టార్పాలిన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈవీఎంలను స్వీకరించే సందర్భంలో సిబ్బందికి, సెక్టోరల్ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు. నల్గొండ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి భద్రపరిచే ఈవీఎంల స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఎన్నికల పరిశీలకులు వసతి ని పరిశీలించారు.


         పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమన్న తదితరులు ఉన్నారు

____________________________________

 జారీ చేసిన వారు సహయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన