*భద్రాచలం ఎఫ్డీవో సుజాత, డీఆర్వో కృష్ణయ్య రూ.3.5 లక్షల లంచంతో రెడ్హ్యాండెడ్*
*"చెట్టు పేరుతో కోట్ల దోపిడీ.. అడవి తల్లిని అమ్ముకుంటున్న అధికారులు!"* *భద్రాచలం ఎఫ్డీవో సుజాత, డీఆర్వో కృష్ణయ్య రూ.3.5 లక్షల లంచంతో రెడ్హ్యాండెడ్* *"కేసు పెట్టకుండా ఉండాలంటే రూ.10 లక్షలు" - కాంట్రాక్టర్తో బేరం* *అటవీ శాఖలో అవినీతి కుళ్ళు - ఏసీబీ దెబ్బకు బట్టబయలు* *భద్రాద్రి కొత్తగూడెం:* అడవులను కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులే అడవి తల్లిని అమ్ముకుంటున్నారు. చెట్లు నరికితే కేసులు పెట్టాల్సిన వాళ్లే, లంచం కోసం కేసులు ఎత్తేస్తున్నారు. భద్రాచలంలో ఏసీబీ దాడులతో అటవీ శాఖలో పేరుకుపోయిన అవినీతి కంపు మరోసారి బయటపడింది. *అసలు ఏం జరిగింది?* చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. పనుల్లో భాగంగా పొరపాటున కొన్ని చెట్లకు నష్టం జరిగింది. ఇదే అదనుగా భావించిన భద్రాచలం ఎఫ్డీవో సుజాత, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు కాంట్రాక్టర్తో బేరానికి దిగింది. *"10 లక్షలు ఇస్తే సెటిల్ చేస్తా" - ఎఫ్డీవో బెదిరింపు* చెట్లు దెబ్బతిన్నాయనే సాకుతో ఎఫ్డీవో సుజాత ఏకంగా రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. చివరకు రూ.3.5 లక్షలకు బేరం కుదిరింది. గు...