*భద్రాచలం ఎఫ్‌డీవో సుజాత, డీఆర్వో కృష్ణయ్య రూ.3.5 లక్షల లంచంతో రెడ్‌హ్యాండెడ్*



*"చెట్టు పేరుతో కోట్ల దోపిడీ.. అడవి తల్లిని అమ్ముకుంటున్న అధికారులు!"*  

*భద్రాచలం ఎఫ్‌డీవో సుజాత, డీఆర్వో కృష్ణయ్య రూ.3.5 లక్షల లంచంతో రెడ్‌హ్యాండెడ్*  

*"కేసు పెట్టకుండా ఉండాలంటే రూ.10 లక్షలు" - కాంట్రాక్టర్‌తో బేరం*  

*అటవీ శాఖలో అవినీతి కుళ్ళు - ఏసీబీ దెబ్బకు బట్టబయలు*


*భద్రాద్రి కొత్తగూడెం:* అడవులను కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులే అడవి తల్లిని అమ్ముకుంటున్నారు. చెట్లు నరికితే కేసులు పెట్టాల్సిన వాళ్లే, లంచం కోసం కేసులు ఎత్తేస్తున్నారు. భద్రాచలంలో ఏసీబీ దాడులతో అటవీ శాఖలో పేరుకుపోయిన అవినీతి కంపు మరోసారి బయటపడింది.


*అసలు ఏం జరిగింది?*  

చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. పనుల్లో భాగంగా పొరపాటున కొన్ని చెట్లకు నష్టం జరిగింది. ఇదే అదనుగా భావించిన భద్రాచలం ఎఫ్‌డీవో సుజాత, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు కాంట్రాక్టర్‌తో బేరానికి దిగింది.


*"10 లక్షలు ఇస్తే సెటిల్ చేస్తా" - ఎఫ్‌డీవో బెదిరింపు*  

చెట్లు దెబ్బతిన్నాయనే సాకుతో ఎఫ్‌డీవో సుజాత ఏకంగా రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. చివరకు రూ.3.5 లక్షలకు బేరం కుదిరింది. గురువారం భద్రాచలంలోని అటవీ శాఖ కార్యాలయంలోనే ఆ మొత్తాన్ని లంచంగా తీసుకుంటుండగా, ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి చేసి ఎఫ్‌డీవో సుజాతతో పాటు, చర్ల ఇన్‌చార్జి డీఆర్వో కృష్ణయ్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


*అటవీ శాఖ - అవినీతికి అడ్డా!*  

ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కొత్తగూడెం అటవీ అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి రూ.3.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. చెట్టు కూలితే లక్షలు, మొక్క నాటితే లక్షలు.. అడవి పేరు చెప్పి అధికారులు కోట్లు దండుకుంటున్నారు. పరిరక్షణ పేరుతో ప్రజాధనం దోపిడీ చేస్తున్నారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్