పాతబస్తీలో పేలుళ్లు కలకలం రేపాయి. సైదాబాద్లోని వీఐపీ పాఠశాల పక్కనున్న ఓ భవన నిర్మాణం పనుల్లో భాగంగా.. జిలెటిన్ స్టిక్స్ ఉపయోగించి పేలుళ్లు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా భారీ శబ్ధాలు రావడంతో.. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.అయితే అకస్మాత్తుగా ఈ పేలుళ్లు సంభవించడంతో.. స్థానికులు, పక్కనే ఉన్న పాఠశాల విద్యార్ధులు భయాందోళనలకు గురయ్యారు. పేలుళ్ల కోసం భారీ జిలెటిన్స్టిక్స్ను ఉపయోగించడంతో భారీ శబ్ధం వచ్చింది. సమీపంలోని పలువురికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఘటనపై స్కూల్ యాజమాన్యంతో పాటు.. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.అక్కడి నుంచి జిలెటిన్ స్టిక్స్, పేలుళ్ల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిర్మాణం చేపడుతున్న యజమానితో పాటు కార్మికులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment