పోలీసు విధులకు బంగం కల్పించిన ఏడుగురు లారీ యజమానుల అరెస్ట్

పోలీసు విధులకు బంగం కల్పించిన ఏడుగురు లారీ యజమానుల అరెస్ట్


గత కొద్ది రోజులుగా సిర్పూర్ పేపర్ మిల్లు  యజమాన్యం, లారీ అసోసియేసన్ సబ్యులకు మద్య గొడవలు జరుగుతున్నా యని, ఈ గొడవల వల్ల  జిల్లాలో 30 పోలీసు ఆక్ట్ అమలులో ఉండగా  లారీ అసోసియేసన్ సభ్యులను రెచ్చగొట్టి పబ్లిక్ రోడ్డు పై గందరగోళం చేసిన 7 లారీ యజమానులను అరెస్టు చేసి ఆదివారం రిమాండ్ కు పంపినట్లు కాగజ్ నగర్  సిఐ .టి కిరణ్ తెలిపారు. అసోసియేషన్ భవనం దగ్గర నిలిపి ఉంచిన లారీ కి నిప్పు పెట్టి అల్లర్లు సృస్టిస్తూ పోలీసు విధులకు భంగం  కలిగించారని, అందువల్ల వారిని అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. అరెస్టయినవారిలో  వెన్న వెంకట కిషోర్ బాబు, ధోబి శంకర్,  మహమ్మద్ తాజ్, యూసుఫ్ ఖాన్, ఖాజా ఫసియోద్దీన్,తాహెర్ హుస్సేన్ , మాచర్ల శ్రీనివాస్ లున్నారని ఆయన తెలిపారు.  వీరిని ఆసిఫాబాద్ జైలుకు తరలించినట్లు పట్టణ సి‌ఐ శ్రీ కిరణ్ గారు తెలిపినారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్