ఫేసుబుక్లో అమ్మాయి ఖాతాతో ఫిషింగ్ లింక్ పంపించి వ్యక్తిగత సమాచారం సేకరించి బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్న ఓ బిటెక్ విద్యార్థిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.మౌలాలీ ప్రాంతానికి చెందిన మునీర్ అహ్మాద్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ సమయంలో ఎథికల్ హ్యాకింగ్ వర్క్షాపుకు హాజరై హ్యాకింగ్ గురించి నేర్చుకున్నాడు. దీంతో మెలిన సోఫియా పేరుతో ఓ ఫేసుబుక్ ఖాతాను తెరిచి జెడ్ అప్లికేషన్ ద్వారా ఫిషింగ్ లింక్ను పంపిస్తున్నాడు. ఇలా పంపిన ఫిషింగ్ లింక్ను ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి క్లిక్ చేసింది. వెంటనే ఆ యువతికి చెందిన యూజర్ నేమ్, పాసువార్డుతో పాటు ఆమె ఖాతాలో ఉన్న అన్ని వివరాలు అతని చేతిలోకి వెళ్ళిపోయాయి. ఇలా మున్నీర్ యువతి బ్యాంక్ ఖాతాలతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరించుకుని బ్లాక్మెయిలింగ్కు దిగాడు. డబ్బు ఇవ్వకపోతే ఆమె సమాచారాన్ని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. బాధితురాలు వెంటనే రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో ఇన్స్పెక్టర్ బృందం ఐపీ అడ్రస్సు ద్వారా మునీర్ నిందితుడిగా గుర్తించి అతనిని అరెస్టు చేశారు. అతని నుంచి స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్లను క్లిక్ చేయొద్దని సైబర్ క్రైం పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు...
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment