Skip to main content

ఐటీ ఉద్యోగిని రేప్‌కేసులో 35ఏళ్ల జైలు

*ఐటీ ఉద్యోగిని రేప్‌కేసులో 35ఏళ్ల జైలు*                                                                                                                   12 ఏళ్ల క్రితం పుణెలోని ఐటీ సంస్థలను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన విప్రో బీపీఓ ఉద్యోగినిపై అత్యాచారం, హత్య కేసులో దోషులకు 35 సంవత్సరాల జైలు శిక్ష పడింది. సోమవారం బాంబే హైకోర్టు ఉరిశిక్షను జైలు శిక్షకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. 2007లో 22 ఏళ్ల యువతి మీద పురుషోత్తం బోరాటె, ప్రదీప్ కొకడే ఈ దారుణానికి ఒడిగట్టారు. 2017లో దోషులకు రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించడంతో పాటు సుప్రీం కోర్టు సెషన్స్‌ కోర్టు తీర్పును సమర్ధించింది. తమ ఉరిశిక్షను అమలు చేయడంలో ఆలస్యం జరుగుతుందని, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని పురుషోత్తం, ప్రదీప్‌ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే తమ శిక్షను తగ్గించాలంటూ వారు అభ్యర్థించారు. తీర్పు వెలువడిన తరవాత కూడా యరవాడ జైలులో ఏడు సంవత్సరాలుగా ఉన్నారని  నిందితుల తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా బాంబే హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. 


నవంబరు 1, 2007లో చోటుచేసుకున్న ఈ ఘటనతో పుణెలోని ఐటీ సంస్థలు షాక్‌కు గురయ్యాయి. బాధితురాలిని క్యాబ్ డ్రైవర్‌ సంస్థ వద్ద దిగబెట్టకుండా అప్పటికే క్యాబ్‌లో ఉన్న ప్రదీప్‌తో కలిసి  మరో ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమె మీద అత్యాచారానికి ఒడిగట్టి, తరువాత గుర్తుపట్టని విధంగా దారుణంగా హత్య చేశారు. 15 కిలోమీటర్ల దూరంలో ఆమె దేహాన్ని పడేశారు. అంతేకాకుండా ఆమె కార్యాలయానికి వచ్చినట్లు తప్పుడు ఎంట్రీ కూడా చేశారు. ఈ ఘటన జరిగిన తరవాత రోజే పోలీసులు వారిని అరెస్టు చేయగా, అక్కడి సెషన్స్ కోర్టు 2012లో వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్