నాగార్జున సాగర్,జూలై 26.రాష్ట్రం లో ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు.శుక్రవారం నాగార్జున సాగర్ నియోజక వర్గం నందికొండ మున్సిపాలిటీ లో 3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాల ఎస్.సి.,ఎస్.టి.వసతి గృహాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా రంగం పై ప్రత్యెక దృష్టి పెట్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు,ఆయన తెలిపారు.రాష్ట్రంలో కళాశాల ల్లో విద్య నభ్యసించిన విద్యార్థి ప్రపంచంలో ఆత్మ విశ్వాసంతో పోటీ పడే విదంగా విద్యా రంగంలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు వినియోగించుకొని విద్యార్థులు చదువులో రాణించాలని అన్నారు.నంది కొండ మున్సిపాలిటీ ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు,మున్సిపాలిటీ నీ ఆదర్శంగా రూపొందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,ఎం.ఎల్.సి తేరా చిన్నప రెడ్డి,స్థానిక శాసన సభ్యులు నోముల నర్సింహయ్య తదితరులు పాల్గొన్నారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment