Skip to main content

**రాష్ట్రంలో అర్హులైన 25 లక్షల మంది  పేదలకు ఉగాది నాటికి ఇళ్ళస్థలాలు**

అమరావతి


రాష్ట్రంలో అర్హులైన 25 లక్షల మంది  పేదలకు ఉగాది నాటికి ఇళ్ళస్థలాలు


• ఇప్పటివరకు కేంద్రం నుంచి పట్టణ పేదలకు మొత్తం 7,53,527 గృహాలు మంజూరు


• సంతృప్తస్థాయిలో  అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు : రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు


అమరావతి, డిసెంబర్ 27 : వచ్చే ఉగాది నాటికి కులం, మతం, జాతి వివక్ష అన్నది లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సంతృప్తస్థాయిలో ఇళ్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.  కేంద్ర మంజూరు మరియు పర్యవేక్షణ కమిటీ (సీఎస్ఎంసీ) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 3,70,255 గృహాలు మంజూరు చేసిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు  వెల్లడించారు.  అందులో భాగంగా 1,28,941 గృహాలు పట్టణ ప్రాంతానికి సంబంధించినవి కాగా, 2,41,314 గృహాలు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో మంజూరు అయ్యాయని మంత్రి పేర్కొన్నారు.  ఈ గృహాల ప్రాజెక్టు విలువ రూ.10,545.78 కోట్లని ఇందులో కేంద్రం వాటా రూ.5,553.82 కోట్లు కాగా, రాష్ట్ర వాటా రూ. 2,495.98  కోట్లు, లబ్ధిదారుని వాటా/బ్యాంక్ లోను 2,495.98 కోట్లు అని మంత్రి వివరించారు. 3,70,255 లబ్దిదారుల్లో ఎస్సీలు 72,797 ఎస్టీలు 12,265, బీసీలు 2,02,326, మైనార్టీలు 34,626 మరియు ఇతరులు 82,867 ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు మంజూరైన 3,83,272 ఇళ్లు కలుపుకొని ఈ ప్రభుత్వం వచ్చాక కేంద్రం నుంచి పట్టణ పేదలకు మొత్తం 7,53,527 గృహాలు మంజూరు అయ్యాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే  4 సంవత్సరాలలో గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణ ప్రాంతాలు కలిపి మొత్తం 25 లక్షల ఇళ్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.  


ఇప్పటివరకు 21 లక్షల మందికి ఇంటి నివేశన స్థలాలు అవసరమని, 7 లక్షల మందికి ఇళ్లు అవసరమని దరఖాస్తులు వచ్చాయన్నారు.  28 లక్షల మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యిందని మంత్రి వివరించారు. రెవెన్యూ శాఖ మంత్రితో కలిసి 9 జిల్లాల్లో  పర్యటించి భూసేకరణ కోసం సమీక్షలు కూడా చేశామన్నారు. రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించిన అనంతరం త్వరలోనే మిగిలిన 3 జిల్లాల్లో కూడా పర్యటించి భూసేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. 


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగమైన పేదలందరికీ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని మంత్రి అన్నారు. ఇప్పటికే అర్హులైన లబ్ధిదారుల జాబితాలను రూపొందించడం జరిగిందని అన్నారు. నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రానున్న నాలుగేళ్లలో నాలుగు విడతల్లో 25 లక్షల పక్కాగృహాలను కూడా నిర్మించి ఇస్తామని తెలిపారు. ఇప్పటికే పేదలకు ఇచ్చే భూమిని సేకరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 


గ్రామాల్లో సగటున ఒక్కో లబ్ధిదారుకు సెంటున్నర భూమి, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమి కేటాయించి  పక్కా ఇళ్లు కట్టుకునేలా ప్రోత్సహించనున్నామన్నారు. అందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో కూడా భూమిని సేకరించేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నామని అన్నారు. ఇళ్ల స్థలాల కోసం ఇప్పటికే గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా గ్రామం, పట్టణ వార్డులవారీగా దరఖాస్తులు స్వీకరించామని మంత్రి అన్నారు. ఇళ్లస్థలాల కోసం అనువైన అన్ని రకాల ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించడం జరిగిందన్నారు. ప్రభుత్వ భూమి లభ్యత లేని చోట ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమిని కొనుగోలు చేస్తామని అన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేయడం జరగదని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బలవంతపు భూసేకరణకు ఈ ప్రభుత్వం వ్యతిరేకమనే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఈ భూసేకరణ, భూ అభివృద్ది కోసం సుమారు 45 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేశామన్నారు. అదే విధంగా ప్రభుత్వం స్థలంతో పాటుగా 22వేల ఎకరాల అవసరమవుతాయని  ప్రభుత్వం అంచనా వేసిందన్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే తద్వారా ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల సంపద సృష్టించవచ్చని మంత్రి అన్నారు. రానున్న ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లను ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో ఇళ్లు లేని వారు ఉండకూడదనే లక్యంనేతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. 


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్