Skip to main content

** *ఏ.యం.అర్.పి.లో లెవల్ కెనాల్ నుండి సాగు నీరు విడుదల చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి**


*ఏ.యం.అర్.పి.లో లెవల్ కెనాల్ నుండి సాగు నీరు విడుదల చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి*



ఏ.యం.అర్.పి. లో లెవల్ కెనాల్ (దిగువ కాలువ)నుండి పంపులు స్వీచ్ ఆన్ చేసి ఆయకట్టు రైతాంగానికి సాగు నీటిని శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సాగు నీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.రైతులు ప్రతి నీటి చుక్కను వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏ.యం.అర్.పి.లో లెవల్ కెనాల్ 
ద్వారా .65 టీ.యం.సి నీటిని 27 చెరువులు నింపడమే గాక,2.67 టీ.యం. సీ.నీటిని రబీలో  6 తడుల కు ఆన్ అండ్ ఆఫ్ (వార బంది) పద్దతి ద్వారా ఏప్రిల్ 4 వరకు  విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.పంటల పరిస్థితి,సాగు నీటి లభ్యత ననుసరించి నీటి విడుదల కొనసాగించ నున్నట్లు తెలిపారు .హై లెవెల్ కెనాల్ ద్వారా 2 లక్షల 20 వేల ఎకరాల రబీ ఆయకట్టు కు నీటి విడుదల కొనసాగుతోందని అన్నారు. ఏడు విడతలు వార బంధి పద్ధతిన  ఏప్రిల్ మొదటి వరకు ఇవ్వడానికి ప్రణాళిక ఖరారు చేయడం జరిగిందని తెలిపారు. నీటివిడుదల నీటి లభ్యత పంటల పరిస్థితి ని అనుసరించి నీటి విడుదల కొనసాగింపు చేయనున్నట్లు తెలిపారు.మంత్రి వెంట రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసన సభ్యులు నోముల నర్సింహయ్యా,కంచర్ల భూపాల్ రెడ్డి,ఎన్.భాస్కర్ రావు, ఏ.యం.అర్.పి.ఎస్.ఈ.సి.సాయి బాబా, ఈ ఈ సి.హెచ్. బుచ్చి రెడ్డి,డిప్యూటీ ఈ ఈ.లు బి. వెంకటేశ్వర్ రావు ,జి. విటలేశ్వర్, టింకు డే, ఏ.ఈ.లు తదితరులు పాల్గొన్నారు


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్