Skip to main content

**యూపీ పోలీసులే విధ్వంసకారులు సినీ నటి స్వరాభాస్కర్‌**

యూపీ పోలీసులే విధ్వంసకారులు
సినీ నటి స్వరాభాస్కర్‌


పౌరసత్వ చట్ట సవరణ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌ వ్యతిరేక ఉద్యమంలో ఉత్తరప్రదేశ్‌ పోలీసుల తీరుపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా విమర్శలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పథకం ప్రకారమే ఆందోళనకారులను ప్రజానీకం దృష్టిలో ఒంటరి చేసేందుకు ఆ విధ్వంసానికి పాల్పడి నాటకాలు ఆడుతున్నారని వర్తమాన సినీ నటి స్వరాభాస్కర్‌ వ్యాఖ్యానించారు. చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమకారులపై వ్యతిరేకత వచ్చేందుకు పోలీసులే ప్రజల ఆస్తులను పెద్దఎత్తున ధ్వంసం చేసినట్టు ఆమె విమర్శించారు. గురువారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఆందోళకారులు సంయమనం పాటిస్తూ పోరాటం చేస్తున్నారని వివరించారు.అయినా, ప్రభుత్వ వారిపై తప్పడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రతి పౌరుడి హక్కు అని ఆమె గుర్తు చేశారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మోడీ సర్కార్‌ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఆందోళనకారులు చెబుతున్నట్టు రాజ్యాంగ ఉల్లంఘన నిజం కాదా?


అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటువంటి కీలక సమయాల్లోనే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసుల విధ్వంసంపై న్యాయ వ్యవస్థ ఇప్పటికైనా స్పందించి నిష్పక్ష విచారణ జరిపించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ సమావేశానికి ముందు స్వరా భాస్కర్‌ సిఎఎ, ఎన్‌ఆర్‌సిలకు వ్యతిరేకంగా ప్లకార్డులతో తన నిరసన తెలిపి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకి సంఘీభావం పలికారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్