హాకా భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నూతన సంవత్సరం రాక సంధర్భంగా మీడియా సోదరులతో ముఖాముఖి హాజరైన వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్ధసారధి గారు, కమీషనర్ రాహుల్ బొజ్జా గారు, వ్యవసాయ విశ్వ విద్యాలయం వీసీ ప్రవీణ్ రావు గారు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామక్రిష్ణా రెడ్డి గారు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఉద్యానశాఖ కమీషనర్ వెంకట్రాంరెడ్డి గారు, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు గారు, మార్క్ ఫెడ్ ఎండీ భాస్కరాచారి గారు, అగ్రోస్ ఎండీ రాములు గారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment