Skip to main content

**ఉల్లికి.. వెల్లుల్లి తోడైంది.. ఇక జనం పరిస్థితి అంతే..!**

ఉల్లికి.. వెల్లుల్లి తోడైంది..


ఇక జనం పరిస్థితి అంతే..!


మొన్నటి వరకూ ఉల్లి హడలెత్తిస్తే.. ఇప్పుడు వెల్లుల్లి ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. మూడునెలలతో పోలిస్తే వెల్లుల్లి గడ్డ ధర ఏకంగా 250 రూపాయలకు చేరింది. ఉల్లి, వెల్లుల్లి ధరలు పెరిగిపోవడంతో వంట ఎలా చేసుకోవాలో తెలియక పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంతలా ధరలు పెరగడం ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు చెబుతున్నారు.
నిన్నటి వరకూ ఉల్లి ధర పేలిపోయింది. కోయడం కాదు కదా ముట్టుకోవాలంటే జనం భయపడే పరిస్థితి వచ్చింది. దాదాపు రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో జనం అల్లాడిపోయారు. ప్రభుత్వ ఈజిప్టు నుంచి ఉల్లిదిగుమతులు చేసుకుని..
వాటిని రాయితీపై అందించే వరకూ ఉల్లి రెండువందల రూపాయలే పలికింది. ఇప్పుడిప్పుడే ఉల్లి ధర దిగివస్తోంది. ఇలాంటి సమయంలో వెల్లుల్లి .. ఒక్కసారిగా విశ్వరూపాన్ని చూపిస్తోంది. ధర కొండెక్కి కూర్చుంది.
ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెల్లుల్లి రెండు వందల పైచిలుకు పలుకుతోంది. ఇది కూడా హోల్ సేల్ మార్కెట్లో ఈ ధరకు లభిస్తోంది. ఇక రిటైల్ మార్కెట్‌లో నైతే... ఏకంగా 250 పైనే ధర ఉంది. ఉల్లి తరహాలో ప్రభుత్వం వెల్లుల్లి గడ్డలను కొనుగోలు చేసి.. రాయితీపై అందించాలని జనం కోరుతున్నారు.
సాధారణంగా శీతాకాలంలో వెల్లుల్లి ధరలు కాస్త పెరగడం కామన్‌. కానీ ఈ స్థాయిలో పెరగడం ఎప్పుడూ చూడలేదని వ్యాపారస్థులు చెబుతున్నారు. ధరలు అధికంగా ఉండటంతో .. వ్యాపారం పడిపోయిందంటున్నారు. దీనికి తోడు రైతుల దగ్గర నుండి సరుకు మార్కెట్ కు రాకముందే దళారులు పక్కదారి పట్టిస్తున్నారని చెబుతున్నారు. ప్రధానంగా వెల్లుల్లి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ లో కురిసిన అకాల వర్షాలతో పంట దిగుబడి కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో వెల్లుల్లి ధర కొండె క్కింది. నేషనల్‌ హార్టికల్చర్‌ బోర్డ్‌ గణాంకాల ప్రకారం వెల్లుల్లి ధరలు ఢిల్లీలో అత్యధికంగా 55శాతం పెరిగాయి.
ముంబయిలోని రిటైల్‌ మార్కెట్లో కిలో వెల్లుల్లి రూ.250 రూపాయలకు ఎగబాకింది. గతనెలతో పోలిస్తే 100 శాతం పెరిగింది. కొన్ని వారాలుగా మహారాష్ట్ర, గుజరాత్‌ మార్కెట్లతో పాటు దక్షిణాది రాష్ట్రాల మార్కెట్లకు సరఫరా తగ్గడంతో ఉన్నపలంగా డిమాండ్‌ బాగా పెరిగింది. ముంబయి హౌల్‌సేల్‌ మార్కెట్‌కు 112 టన్నుల వెల్లుల్లి అవసరం కాగా.. 64 టన్నుల వరకూ వస్తున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు మార్కెట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఉల్లి, వెల్లుల్లి ధరలు పెరిగిపోయి.. తమ జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని .. పేద, సామాన్యతరగతి ప్రజలు వాపోతున్నారు.పెరిగిన ధరలను ప్రభుత్వమే భరించి.. రాయితీపై అందించాలని కోరుతున్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్