కళ్యాణ మహోత్సవానికి హాజరైన మంత్రి నిరంజన్ రెడ్డి
నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో గల శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం లో మంగళవారం నిర్వహించిన గోదాదేవి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ... మంత్రి నిరంజన్ రెడ్డి కి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా కళ్యాణ మహోత్సవానికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు .. కళ్యాణ మహోత్సవం లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు .. .. ఆలయంలో ముడుపు గట్టి మొక్కు చెల్లించుకుని ఆలయ అర్చకులు ఇచ్చిన తీర్థప్రసాదాలను స్వీకరించారు ... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దర్శించుకుం తానని, ఈ దేవాలయం మా కుటుంబానికి నమ్మకంగా నిలిచిందని పేర్కొన్నారు ... ప్రతి ఒక్కరూ భక్తి భావంతో మెలగాలని ఆయన కోరారు ... రానున్న రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి మరలా దర్శించుకొంటా అని అన్నారు ... ఈ కార్యక్రమంలో లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీపీ బచుపల్లి శ్రీ దేవి గంగాధర్ రావు, జెడ్పిటిసి మాద ధనలక్ష్మీ నగేష్ గౌడ్, సర్పంచ్ ఏకుల కవిత విజయ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment