జమస్తాన్ పల్లి(మర్రి గూడ),జనవరి 4.పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామస్థులు,ప్రజా ప్రతినిధులు,అధికారులు అందరూ భాగస్వామ్యులై గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ది చేసుకోవాలని నల్గొండ ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు.శని వారం పల్లెప్రగతి రెండవ దశ కార్య క్రమంలో బాగంగా మునుగొడ్ మండలం జమస్థాన్ పల్లి గ్రామంలో పాల్గొని గ్రామంలో పర్యటించి పల్లె ప్రగతి లో చేపట్టిన కార్యక్రమాలు పరిశీలించి గ్రామస్థుల తో చర్చించి అధికారులకు సూచనలు చేశారు.గ్రామం లో మొదటి దశ పల్లె ప్రగతి లో నిర్మించిన డ్రైన్ ను పరిశీలించారు.ప్రాథమిక పాఠశాల, ఆంగన్ వాడి సందర్శించి పిల్లలను పోషకాహారం, మెనూ గురించి ఆరా తీశారు. పాఠ శాల దగ్గర డంపింగ్ యార్డ్,స్మశాన వాటిక స్థలం పరిశీలించి
వెంటనే పనులు ప్రారంభించాలని పంచాయతీ రాజ్ ఏ.ఈ.,ఈ.జి.ఎస్ సిబ్బంది ఆదేశించారు.
ప్రాథమిక పాఠశాల ముందు ,వర్షపు నీరు నిలిచి ఉండడం గమనించిన ఇంఛార్జి కలెక్టర్ కమ్యూనిటీ సోక్ పిట్ నిర్మాణం చేయాలని ఆదేశించారు.గ్రామంలో పాత నీటి ట్యాంక్ నుండి మిషన్ భగీరథ త్రాగు నీటి ని నల్లాలు బిగించి అంద చేయాలని అర్.డబ్ల్యూ.ఎస్. ఈ ఈ.నీ ఆదేశించారు.ఈ కార్యక్రమం లో అర్.డి.ఓ.జగదీశ్వర్ రెడ్డి,జిల్లా పంచాయతీ అధికారి విష్ణు వర్ధన్, అర్. డబ్ల్యు. ఎస్., ఈ ఈ పాపా రావు, డి.పి.అర్. ఓ.శ్రీనివాస్,తహశీల్దార్ దేశ్యా,ఎం.పి.డి.ఓ.,సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment