Skip to main content

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పై మాస్టర్ ట్రైనర్ లకు శిక్షణా కార్యక్రమం

 

*గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పై మాస్టర్ ట్రైనర్ లకు శిక్షణా కార్యక్రమం*

మార్చి 14వ తేదీన జరుగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని, అందుకు ప్రిసైడింగ్ మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు రెండువిడతల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థులను ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేస్తారని అన్నారు. పోలింగ్ నిర్వహణ కొరకు సిబ్బంది ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందని, పోలింగ్ సిబ్బందికి రెండు విడతలలో మార్చి 2 వ తేదీ మరియు 9వ తేదీలలో ఆయా జిల్లా కేంద్రాలలో జిల్లా ఎన్నికల అధికారులైన జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మాస్టర్ ట్రైనర్లు జిల్లా కేంద్రాలలో జరిగే ఇట్టి శిక్షణా కార్యక్రమంలో ప్రిసైడింగ్ మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల నిబంధనలు, పోలింగ్ ముందురోజు డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ మెటీరియల్ స్వీకరించి, పరిశీలించుకోవడం, పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు, పోలింగ్ రోజున బ్యాలెట్ బాక్సుల వినియోగం, బ్యాలెట్ పత్రాలను పోలింగ్ కొరకు సిద్ధం చేసుకోవడం, ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేసే విధానం, ఓటింగ్ రహస్యాన్ని కాపాడడం, నిర్దేశించిన సమయాలలో పోలింగ్ ను ప్రారంభించి, ముగించడం, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను సీలు వేయడం, ఎన్నికల పత్రాలను పూరించి, సీలు వేసి, రిసెప్షన్ కేంద్రంలో అప్పగించడం తదితర అన్ని అంశాలపై మాస్టర్ ట్రైనర్ లు సవివరంగా శిక్షణ ను అందించాలని తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రంలో పోలింగ్ నిర్వహణ కు చేపట్టవలసిన జాగ్రత్తలను ఎన్నికల సంఘం సూచించిందని, వాటిని కూడా పాటించాలని తెలిపారు. 

ఈ శిక్షణా కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, డీఆర్వో యన్. జగదీశ్వర్ రెడ్డి, శిక్షణా నోడల్ అధికారి

రాజ్ కుమార్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, మాస్టర్ ట్రైనర్లు తరాల పరమేశ్, వి.రమేష్, డి. బాలు, జానారెడ్డి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్