Skip to main content

ఎబివిపి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ యూనివర్సిటి రిజిస్ట్రార్ చాంబర్ ముందు బైఠాయింపు

  



ఎబివిపి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ యూనివర్సిటి రిజిస్ట్రార్ చాంబర్ ముందు బైఠాయింపు


నల్లగొండలోని పానగల్ రోడ్డులో  ఎల్లమ్మ గుడి సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల బాలికల వసతి గృహానికి సంబంధించిన ఎకరం భూమిని ప్రభుత్వం అక్రమంగా తీసుకోవడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో  రిజిస్ట్రార్ చాంబర్ ముందు బైఠాయించడం జరిగిందని రిజిస్ట్రార్  ఈ అంశం నా పరిధిలో లేదని విసీ  పరిధిలో ఉందని చేతులు దులుపుకోవడం తో మండిపడ్డ విద్యార్థి నాయకులు విసి చాంబర్లో దుప్పట్ల తో విసీ గారు వచ్చేంత వరకు ఇక్కడే నిద్రపోతాం అని చెప్పి నిరసన తెలపడం జరిగింది.ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కారుపోతుల రేవంత్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లనే యూనివర్సిటీ భూములు కబ్జాకు గురవుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ యూనివర్సిటీ నాయకుడు పొట్టిపాక నాగరాజు గారు మాట్లాడుతూ  ఇంత జరుగుతున్నా యూనివర్సిటీ అధికారులు నిద్రపోతున్నారని, యూనివర్సిటీ భూములను అక్రమంగా ఇతరులకు అప్పగిస్తూన్నారని మండిపడ్డారు. విసి గారు 15 నెలలు గడుస్తున్నా ఇంతవరకు యూనివర్సిటీ రాలేదని మండిపడ్డారు.విసి వచ్చేవరకు ఇక్కడే ఉంటామని అధికారులు తక్షణమే స్పందించాలని యూనివర్సిటీ భూములను యునివర్సిటీ కేటాయించాలని లేని ఎడల ఏబీవీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు విజ్ఞేష్, శివ, దయాకర్, ఛత్రపతి, శ్రీనివాస్,విప్లవ్,రవి, సంపత్, తదితరులు పాల్గొన్నారు.*

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్