Skip to main content

తమ ఉనికి కోసం, అల్పానందం కోసం 'రామాయణం' మీదపడి ఏడ్చే తోడేళ్ళమందకి ఈ వ్యాసం అంకితం

 


తమ ఉనికి కోసం, అల్పానందం కోసం 'రామాయణం' మీదపడి ఏడ్చే తోడేళ్ళమందకి ఈ వ్యాసం అంకితం

ఇది చదివినాక మీకు ఇంకా బతికే అర్హత ఉంది అనుకుంటే సిగ్గు,శరం లేకుండా బ్రతికేయొచ్చు...లేదా ఎందులోనైనా దూకి చావండి..మంచివాళ్ళే పోతున్నారు..మీరు చచ్చినంత మాత్రాన భూమికేమి వెలితి కాదు.


'రామాయణము'అంటే రామునియొక్క ప్రయాణము,రాముడు నడిచిన మార్గము...అనగా రాముడు నడిచిన ధర్మ మార్గము...ఆ ధర్మమార్గం ఏమిటో చూద్దాం..

సీతా స్వయంవరం జరుగుతుంది..రాజులు,చక్రవర్తులు ప్రగల్బాలు పలుకుతూ వచ్చి శివధనస్సుని ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి బంగపడుతున్నారు.. రాముడు ధనుర్బంగం చేయగలడు..సామర్ద్యం ఉంది కదా అని వెంటనే బలప్రదర్శన చేయలేదు..గురువు ఆజ్ఞ్య వచ్చేవరకూ ఆగాడు. పెద్దలు,గురువుల ఎదుట అంత వినయంగా ఉండేవాడు..

మిడి,మిడి జ్ఞ్యానంతో మిడిసిపడి గురువులనే గడ్డిపోచలుగా భావించే అసుర సంతానానికి రాముడు నచ్చలేదు.


రాముడికి పట్టాభిషేకం అని ప్రకటించారు.కాని పరిస్థితులవల్ల వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది..వెళ్ళకపోతే తండ్రికి అవమానం..తన తండ్రిగారి మర్యాద నిలబెట్టడం కోసం చిరునవ్వుతో రాజవాసాన్ని విడిచి అరణ్యవాసానికి బయలుదేరాడు..

ఆస్తి పంపకాల్లో అర్దరూపాయ్ తక్కువ వస్తే తల్లితండ్రులను లేపేసే పుత్రరత్నాలు ఉన్నారు....మీరు(పైన చెప్పిన తోడేళ్ళమంద) కూడా ఇదే జాతికి చెంది ఉంటారని నా ప్రగాడ విశ్వాసం.అందుకే తండ్రి మాటకి అంత విలువ ఇచ్చిన రాముడు మీకు నచ్చలేదు.


వనవాసంలో సీతాపహరణం జరిగింది...సీతను అన్వేషిస్తుండగా హనుమ,సుగ్రీవుడు ఎదురయ్యారు..వాలి,సుగ్రీవుల మద్య జరిగిన పోరు తెలుసుకుని రాముడు సుగ్రీవుని పక్షం వహించి అతనికి అండగా నిలిచాడు....

వాలి అమిత బలవంతుడు...రాజ్యం, సైన్యం వాలి దగ్గర ఉన్నాయి..రాముడు వాలి పక్షం వహిస్తే తనకు అన్నిరకాలుగా సహాయం చేయగలడు..సుగ్రీవుడు ఒంటరివాడు..

కాని "ధర్మం సుగ్రీవుని వైపున ఉంది కనుక బలహీనుడైనా సుగ్రీవునితో స్నేహం చేశాడు".

అవసరమైతే శత్రువుల దగ్గరికి వెళ్లి ఎక్కడలేని ప్రేమ ఒలకబోసి తమపని కానిచ్చుకోవడం , తమవాళ్ళే కష్టాల్లో ఉన్నా చూసి చూడనట్టు నటించడం ఇలా స్వార్ధంకోసం రంగులు మార్చే మనస్తత్వం ఉన్న ఊసరవెల్లులకి రాముడు నచ్చలేదు.


వాలి సంహారం;.రాముడు ఎదురుగా వచ్చి బాణం వేసినా వాలి నేలకూలుతాడు...రామబాణానికి ఎదురులేదు..

మరి వాలికి ఉన్న వరం సంగతి ఏంటి?..అది వ్యర్దమవుతుంది..దేవతల వరాలు వ్యర్దమయ్యాయంటే మానవులకి దేవతలపై ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుంది.ఆ ప్రభావం యజ్ఞ్య,యాగాలు పూజాది క్రతువులపై పడుతుంది..లోకంలో అధర్మం ప్రబులుతుంది...తాను వచ్చింది ధర్మాన్ని స్థాపించడానికి కాని అధర్మాన్ని కాదు..అందుకే తనకి శక్తిఉన్నా వాలికి ఉన్న వరాన్ని గౌరవించి చాటుగా బాణం వేశాడు.

ఇంకా వాలి నరుడు కాదు. వానరుడు..క్రూర మృగాలని రాజులు చాటునుండి వేటాడవచ్చు..అది ధర్మమే.. 


రావణున్ని ఎదురించి విభీషణుడు రాముడి శరణు వేడాడు..శత్రువుకి సహోదరుడైనా రాముడు అతనికి అభయమిచ్చాడు..లంకకి రాజుని చేస్తానని మాట ఇచ్చాడు...ఐతే రావణుడు లొంగిపోయి సీతను తిరిగి ఇచ్చేస్తే ఏమి చేస్తావని అడిగారు...అతనికి నా రాజ్యాన్ని ఇస్తానన్నాడు రాముడు.


రామ, రావణ యుద్ధం మొదలయ్యింది..ఒకరోజు రావణుడు రాముని చేతిలో పరాజితుడయ్యాడు...రాముని ఎదురుగా నిస్సహాయంగా కూలబడిపోయాడు....తన భార్యను అపహరించి తనను ఇన్ని రోజులుగా ఎంతో మనోవేదనకి గురి చేసిన రావణుడు తన ఎదురుగా అచేతనంగా ఉన్నాడు...అప్పుడు "నీవు నిరాయుదుడవై ఉన్నావు.శక్తిహీనంగా ఉన్నావు. ఒంటరిగా ఉన్నావు..ఇప్పుడు నిన్ను చంపడం ధర్మం కాదు..నేడు పోయి రేపు రా" అన్నాడు.. 

ఏదో ఒకరకంగా వెన్నుపోటు పోడిచైనా శత్రువుని దెబ్బ తీస్తేచాలు..అనుకునే పింజారి వెధవలకి రాముడి ప్రవర్తన నచ్చలేదు మరి..


సీత మీద తన ప్రజల్లో అపవాదు ఉందని రాముడికి గూఢచారుల వల్ల తెలిసింది..అపవాదు ఉన్న సీతను వాళ్లకి పట్టపురాణిగా ఉంచడం ధర్మం కాదు..పరిత్యజించాలి...తాను రాజు కాకపోయి ఉంటే అలా చేయాల్సిన అవసరముండదు..ప్రాణ సమానమైన భార్యను విడిచిపెట్టడం కన్నా రాజ్యాన్ని త్యజించడం మేలనుకున్నాడు..తన తమ్ములను పిలిచి రాజ్యభారాన్ని స్వీకరించామన్నాడు..

తమ్ముళ్ళు వెంటనే రాముడి పాదాలపై పడ్డారు.."అన్నా నీవు అడిగితే మా ప్రాణాలైనా ఆనందంగా ఇచ్చేస్తాం..కాని నీ స్థానంలో కూర్చునే దుస్సాహసం కలలో కూడా చేయలేమన్నారు"..

రాముడు గుండె రాయి చేసుకున్నాడు.తనవల్ల రఘువంశ ప్రతిష్ట మసకబారకూడదనుకున్నాడు..ప్రాణాదికమైన భార్యను విడిచిపెట్టాడు..


"రామో విగ్రహవాన్ ధర్మః" రాముడు నిలువెత్తు ధర్మస్వరూపం.భూమి ఉన్నంత కాలం రామనామం ఉంటుంది..రామనామం లేనినాడు విశ్వమే ఉండదు..

"శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ om

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్