Skip to main content

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదే --మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డి

 




 ఎమ్మెల్సీ ఎన్నికల్లో  గెలుపు బీజేపీదే --మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డి

            ప్రభుత్వానికి  అనివర్గాల వారుదూరమైనారని,  ప్రజలంతా అధికార పార్టీ పై,  ప్రభుత్వం పై   ఆగ్రహం తో ఉన్నారని  ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదే నని  ఉమ్మడి  నల్గొండ జిల్లా mlc ఎన్నికల ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  జిల్లా బీజేపీ అధ్యక్షుడు  కంకణాల శ్రీధర్ రెడ్డి ఆధ్యక్షతన నల్గొండ జిల్లా కార్యాలయంలో    జరిగిన నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల బిజిపి  పోలింగ్ బూత్ కన్వీనర్ వర్క్ షాప్ సమావేశంలో  ఆయన మాట్లాడుతూ బూత్ కన్వీనర్ లు నాయకులు సమిష్టి గా కృషి చేయాలని, గెలుపు బీజేపీదే నని అన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డి  మాట్లాడుతూ బీజేపీ పరంపర  మొదలయిందని దుబ్బాక , జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించిందని, కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు గెలుపు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్  పోలింగ్ బూత్ కన్వీనర్ లకు వర్కు షాప్ నిర్వహించారు. మండలాల వారిగా, పట్టణాల వారిగా సమావేశాలు నిర్వహించి పని విభజన చేసి ఓటర్లను కలవని అయన కోరారు.  రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు శ్రీ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి  మాదగోని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రాజనికుమారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల  నర్సింహారెడ్డి, పల్లెబోయిన శ్యామసుందర్, రాష్ట్ర  మాజీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి,  మాజీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేకేర్, వంగాల స్వామి గౌడ్,  నూకల వెంకట నారాయణ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేకేర్ రెడ్డి,  చనమోని రాములు తదితరులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్