Skip to main content

పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని పరిశీలించి సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్


 రేపు జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో భాగంగా గేమ్యానాయక్ తండా, ఉట్లపల్లి గ్రామాలలో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని పరిశీలించి సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్

*ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పటిష్ట బందోబస్తు : డిఐజి రంగనాధ్*
- - 4,000 పైగా సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు
- - సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రతకు ప్రత్యేక చర్యలు
- - పారామిలటరీ బలగాల పహారాలో ఈవీఎంల తరలింపు

నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల పటిష్ట నిర్వహణ కోసం భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాలను సైతం పరిశీలించి పలు సూచనలు చేయడం జరిగిందని డిఐజి ఏ.వి. రంగనాధ్ చెప్పారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలుండగా వాటిలో 108 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కనీసం 15 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు పోలింగ్ సరళిపై వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు భద్రతతో పాటు మొత్తం నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి చిన్న ఘటన జరిగినా నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకునేలా స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 4,000 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తుండగా 3000 మంది సివిల్ పోలీసులు, వెయ్యికి పైగా పారా మిలటరీ పోలీసులు భద్రతతో భాగస్వామ్యం అవుతారని తెలిపారు. ఇప్పటికే సీఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్, తెలంగాణ స్పెషల్ పోలీస్ బలగాలు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పోలింగ్ ముగిసే వరకు డబ్బుల పంపిణీ, మద్యం పంపిణీ లాంటి అంశాలపై తనిఖీలు కొనసాగుతాయని ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు 50 లక్షల రూపాయల నగదు, 45 లక్షల రూపాయల మద్యం సీజ్ చేయడంతో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద 190 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
*భద్రతా ఏర్పాట్లు ఇలా.....*
శనివారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగే విధంగా పతిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని 4,000 మందికి పైగా భద్రతా విధులలో పాలుపంచుకోనుండగా ఇందులో జిల్లా ఎస్పీ - 1, ఒక నాన్ క్యాడర్ ఎస్పీ, 5 గురు అదనపు ఎస్పీలు, ఎస్పీలు, 14 మంది డిఎస్పీలు, 50 మంది సిఐలు, 180 మంది ఎస్.ఐ.లు, 2,750 మంది సివిల్ పోలీస్ సిబ్బంది, 270 మంది కేంద్ర బలగాలు, మరో 270 మంది తెలంగాణ ప్రత్యేక పోలీసులు, వెయ్యికి పైగా ప్రత్యేక బృందాలతో కూడిన పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.
*పారా మిలటరీ బలగాల భద్రత నడుమ ఈవీఎంల తరలింపు*
శనివారం సాయంత్రం 7-00 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత సంబంధిత రిటర్నింగ్ అధికారి అనుమతితో ఈవీఎం మిషిన్లను ఆయుధాలతో కూడిన పారా మిలటరీ బలగాల భద్రత మధ్య నల్లగొండలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తామని, కౌంటింగ్ రోజు వరకు పటిష్ట భద్రత నడుమ ఈవీఎంలను భద్రపరుస్తామని డిఐజి రంగనాధ్ తెలిపారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్