వీటి కాలనీ వాసులను బెంబేలు ఎత్తిస్తున్న దొంగలు

 


వీటి కాలనీ వాసులను బెంబేలు ఎత్తిస్తున్న దొంగలు

నల్గొండ లోని వీటి కాలనీ లో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.  నెల రోజుల్లో పలు  దొంగతనాలు జరిగాయి.  దీనితో కాలనీ వాసులకు భద్రత కరువయ్యింది.  ఈ కాలనీలో పలువురు వి ఐ పి లు నివసిస్తున్నప్పటికి పోలీసులు సరిగ్గా  గస్తీ లు నిర్వహించడం లేదని పలువురు కాలనీ వాసులు వాపోతున్నారు. శాసన సభ్యులు కంచర్ల కూడా ఈ  కాలనీలోని నివాసం ఉంటారు. పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంపు ఆఫీస్, బీజేపీ రాష్ట్ర నాయకులు, మునిసిపల్ కమీషనర్ రమణాచారి, పోలీసులు అధికారులు, వి ఐ పి లు ఎందరో నివాసం ఉన్న ఈ కాలానికి దొంగల భయం పట్టుకుంది.  పోలీసులు గస్తీ పెంచి కాలనీ ప్రజలకు భరోసా కల్పించాలని వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు నూకల జయపాల్ రెడ్డి  డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ