Skip to main content

నాగర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ మల్లు రవి గారికి ఇవ్వాలి - తెలంగాణ రాష్ట్ర దళిత బహుజన సంఘాల డిమాండ్.


 

నాగర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ మల్లు రవి గారికి ఇవ్వాలి - తెలంగాణ రాష్ట్ర దళిత బహుజన సంఘాల డిమాండ్..


గత నాలుగు దశాబ్దాలుగా తెలంగాణా రాష్ట్ర ప్రజల, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల సమస్యలను, తనదైన శైలిలో పరిష్కారిస్తూ, దళిత , బడుగు ,బలహీన వర్గాల కు బాసటగా నిలిచి నిరంతరం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న మల్లు రవి కి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బే షరతుగా పార్లమెంట్ అభ్యర్థి గా వెంటనే ప్రకటించాలని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు , ప్రజాస్వామ్య వాదులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర దళిత బహుజన సంఘాల నాయకులు అన్నారు. నాలుగు దశాబ్దాలుగా మల్లు స్వర్గీయ మల్లు అనంతరాములు , సోదరునిగా మల్లు ఆశయాలకు అనుగుణంగా, డాక్టర్ బాబా సాహెబ్ చూపిన మార్గంలో ప్రజలతో మమేకమై నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న మల్లు రవి ని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, నాగర్ కర్నూలు ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లు రవి గారిని పార్లమెంట్ అభ్యర్థి గా వెంటనే బే షరతుగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుచున్నారనీ వారు తెలిపారు.అవకాశవాద రాజకీయాలతో ఎంతో మంది రాజకీయ నాయకులు పలు పార్టీలు మారుచున్నా కూడా కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని , కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశానుసారం పని చేస్తూ, పార్టీ అభివృద్ధికి , పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాయకులు మల్లు రవి గారే అని రాష్ట్ర ప్రజలు, పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నారనీ. కేవలం నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని మాత్రమే ఆశించిన మల్లు రవి ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో , సామాజిక సమీకరణలో భాగంగా గతములో తాను జడ్చర్ల శాసన సభ్యనిగా పనిచేసినప్పటికి అది జనరల్ సీటు అయినందున పార్టీ అధిష్టానం అదేశాలను పాటించి జడ్చర్ల శాసనసభ స్థానాన్ని వదులుకున్న గొప్ప త్యాగశీలి మల్లు రవి అని తెలిపారు. అంతేకాకుండా అక్కడ పోటీలో ఉన్న అనిరుధ్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేసి భారీ మెజార్టీతో గెలిపించిన నాయకులు , మల్లు రవి , అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం నుండి పోటీ చేయాలని అవకాశం కల్పించినప్పటికి,సున్నితంగా తిరస్కరించిన విశాల హృదయము కలిగిన నాయకులు మల్లు రవి 

గతములో స్వర్గీయ మల్లు అనంతరాములు నాగర్ కర్నూలు నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడిగా ఆ ప్రాంతానికి చేసిన అభివృద్ధి, పేద ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకొని స్థానిక ప్రజలు ఇప్పటికి కొనియాడుచున్నారనీ మల్లు అనంతరాములు స్వర్గీయ ఇందిరా గాంధీ , రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాలంలో ఆలిండియా కాంగ్రేస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా నియమించబడి అత్యంత విశ్వాస పాత్రునిగా పనిచేసినారని, అదే సమయంలో దక్షిణ భారతదేశంలో 12 రాస్ట్రాలకు ఇంచార్జ్ గా నియంచబడి 12 రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ మల్లు అనంతరాములు గారికే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి మల్లు అనంత రాములు వారసునిగా మల్లు రవి ని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి గా వెంటనే ప్రకటించాలని , నిరు పేదల పెన్నిధిగా, బడుగు బలహీన వర్గాల నేతగా మల్లు రవి కి సముచిత స్థానం కల్పించాలని యావత్ తెలంగాణా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారనీ వారు తెలిపారు


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్