Skip to main content

క్రైస్తవులకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి - రేఖల భద్రాద్రి-


 



*క్రైస్తవులకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి*


*కాంగ్రెస్ నాయకులు,జిల్లా గ్రంథాల సంస్థ మాజీ చైర్మన్ రేఖల భద్రాద్రి*

*************************************************

*నల్లగొండ*: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని క్రైస్తవులకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, ఏఐసిఎఫ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ రేకల భద్రాద్రి కోరారు. మంగళవారం నల్గొండ కలెక్టరేట్ సమీపంలో గల చర్చిలో పాస్టర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో క్రైస్తవులంతా కాంగ్రెస్ పార్టీకి అండగా గెలిపించుకోవడం జరిగిందని తెలిపారు. నల్గొండ నియోజకవర్గంలో కూడా 16 వేల మంది క్రైస్తవులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అండగా ఉండి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్లకు రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ, రాజ్యసభ , రెండు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్రిస్టియన్లకు ఒక రాష్ట్రస్థాయి చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా క్రిస్టియన్లకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికలలో కూడా క్రిస్టియన్లంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయిలో గ్రంథాలయ పరిషత్ చైర్మన్ తనకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలుమార్లు కలిసినందున ఆయన చొరవ తీసుకోవాలని కోరారు.

క్రిస్టియన్లకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం వలన క్రిస్టియన్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

జిల్లా గ్రంథాల సంస్థ మాజీ చైర్మన్ రేఖల భద్రాద్రికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని కోరుతూ చర్చిలో పాస్టర్లంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో పాస్టర్లు, దైవ సేవకులు కట్ట మోసయ్య, జాన్ బాబు, మధుసూదన్, శేషయ్య, కె.యో వెల్, సామెల్, రమేష్, మిషక్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్