జర్నలిస్టుల డిమాండ్స్ ను* *పరిష్కరించాలి* *-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి* *టీయూడబ్ల్యూజే వినతి పత్రం*


 *జర్నలిస్టుల డిమాండ్స్ ను* *పరిష్కరించాలి*

*-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి* *టీయూడబ్ల్యూజే వినతి పత్రం* 


దేశ వ్యాప్తంగా మీడియా సంస్థలు, జర్నలిస్టుల సంక్షేమం కోరుతూ, షహీద్ భగత్ సింగ్ వర్ధంతి రోజైన మార్చ్ 3న, "జర్నలిస్ట్స్ డిమాండ్ డే"కు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు వినతి పత్రాలు సమర్పించారు.

ఈ సందర్బంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం ఆయా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించింది. ఈ సందర్బంగా విరాహత్ అలీ మాట్లాడుతూ,

ప్రెస్ కమిషన్ చివరి నివేదిక 1982లో వెలువడిందని, ఆతర్వాత దేశంలో ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా రాకతో మీడియా దృష్టాంతంలో పెనుమార్పు వచ్చిందని, ఇందుకుగాను మీడియా సమస్యలను పరిష్కరించడానికి కొత్త మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి జర్నలిస్టులకు స్వేచ్ఛ ముఖ్యమైనందున మీడియా సంస్థల, జర్నలిస్టుల భద్రత, రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. శ్రమకు తగ్గ ఫలితం కోసం వర్కింగ్ జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల కోరకు వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. 2007 సంవత్సరంలో జస్టిస్ మజితియా కమిటీ చేసిన సిఫారసులను వెంటనే అమలు చేయాలని ఆయన అన్నారు. ప్రతినిధి బృందంలో ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు

కె.సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్,

వి.యాదగిరి, తెలంగాణ చిన్న, మద్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, హెచ్.యూ.జే అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, హమీద్ షౌకత్, నాయకులు చారీ, మల్లికార్జున్ రెడ్డి, రఫీ, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.


*డిమాండ్లు న్యాయమైనవే...*

*-మంత్రి కిషన్ రెడ్డి*

--------------------------------

మీడియా సంస్థలు, జర్నలిస్టుల క్షేమం కోసం ఐజేయు చేస్తున్న డిమాండ్లు న్యాయపరమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీయుడబ్ల్యూజే ప్రతినిధి బృందం సమర్పించిన వినతి పత్రాన్ని తాను కేంద్రానికి పంపించడమే కాకుండా వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్