ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని జ్యోతిబాపూలే విగ్రహాలకు ముసుగు తొలగించాలి - పాలడుగు నాగార్జున


 ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని జ్యోతిబాపూలే విగ్రహాలకు ముసుగు తొలగించాలి - పాలడుగు నాగార్జున

 

పార్లమెంట్ ఎన్నికల నిబంధనల ప్రకారంగా రాజకీయ నాయకులకు ముసుగులు వేస్తారు. ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి నల్లగొండ పట్టణం లోని పెద్ద గడియారం సెంటర్లో గల జ్యోతిబాపూలే కు తెల్లటి గుడ్డలతో ముసుకు కప్పడం జరిగిందని, గతంలో జరిగిన ఏ ఎన్నికలలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబాపూలే విగ్రహాలకు ముసుగులు కప్పబడి లేదని, నేడు మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి ముసుకు కప్పారని, తగు పరిశీలన జరిపి ఎన్నికల నిబంధనావలి కి లోబడి ముసుగు తొలగించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున వినతి పత్రం సమర్పించారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్