Skip to main content

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి - గుమ్మల


 07/03/2024




*పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి*


*నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి*

******************************************"*******

*నల్లగొండ*: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ పని చేయాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ పట్టణంలోని నల్గొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్,ఎన్ ఎస్ యు ఐ రెండు కళ్ళని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా యూత్ కాంగ్రెస్ నాయకులు డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టి అభ్యర్థులు గెలుపు కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి చేరే విధంగా తమవంతుగా యూత్ కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం పని చేసే యువజన కాంగ్రెస్ నాయకులకు రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు. యూత్ కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసే దిశగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.యూత్ కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకురావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఎదగడానికి యూత్ కాంగ్రెస్ మొదటి మెట్టని అన్నారు.


నల్గొండ మున్సిపల్ చైర్

బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ

 రానున్న రోజుల్లో యూత్ కాంగ్రెస్ మరింత బలపడేలా చూడాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు యూత్ కాంగ్రెస్ నాయకులు ఒక సైనికులు లాగా పనిచెయ్యలని పిలుపునిచ్చారు.


గత ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.

యువజన కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ జహంగీర్ బాబా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, నల్గొండ మండల అధ్యక్షుడు కొప్పు నవీన్ గౌడ్, కనగల్ మండల అధ్యక్షుడు కూసుకుంట్ల రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్