Skip to main content

LRS పై ఉప ముఖ్యమంత్రి భట్టి మాటలు వట్టి మాటలయ్యాయి - ZP ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కంచర్ల


 


LRS పై ఉప ముఖ్యమంత్రి భట్టి మాటలు వట్టి మాటలయ్యాయి - ZP ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కంచర్ల 

*LRS పై భట్టి మాటలు.. వట్టి మాటలేనా..*
*ఉత్తమ్ ముచ్చట.. ఉత్త ముచ్చటేనా..!*
*గతంలో LRSపై కోర్టు కెళ్ళిన కోమటిరెడ్డి... ఇప్పుడు ఏ బార్లో తాగిపడుకున్నాడు*
*LRS పేరుతో 20 వేల కోట్ల దోపిడికి కాంగ్రెస్ కుట్ర..*
*నో ఎల్ ఆర్ ఎస్.. నో కాంగ్రెస్....
.ఈ ఉత్తమ కుమారుల పాలనకు ఇక విఆరెఎస్సే...*


*LRS పై ఉప ముఖ్యమంత్రి భట్టి మాటలు... వట్టి మాటలయ్యాయని..ఉత్తమ్ కుమార్ ముచ్చట.. ఉత్త ముచ్చటేనని ZP ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఎద్దేవా చేశారు.

బారుకు వెళ్ళడమే తెలిసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు.. గతంలో LRSపై కోర్టుకు వెళ్ళారని.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 20 వేల కోట్ల దోపిడీకి కుట్ర చేస్తే ఎక్కడకి పోతాడో చెప్పాలని వారు ప్రశ్నించారు.

LRSను ఉచితంగా అమలు చేయాలని క్లాక్ టవర్ సెంటర్లో BRS రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం ధర్నా కార్యక్రమం చేపట్టింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ZP ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు హాజరయ్యారు.

*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంగ్రెసు అధికారంలోకి వస్తే LRS రద్దు చేస్తామని తప్పుడు హామీ ఇచ్చి నేడు అధికారంలోకి రాగానే సామాన్య ప్రజలపై దాదాపు రూ.20 వేల కోట్ల బాదుడుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని వారు మండిపడ్డారు*

*LRS పై మాట మార్చిన కాంగ్రెస్ ను బొందపెట్టాలనీ ప్రజలు అనుకుంటున్నారని.. ఇక కాంగ్రెస్ కు గోరి కట్టే సమయం ఆసన్నమైందని అన్నారు*

*మేము చేస్తే సంసారం.. ఎదుటివారు చేస్తే వ్యభిచారం అన్నట్లు కాంగ్రెసు ప్రభుత్వం రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తోందని వారు అన్నారు.

ఈ ఉత్తర కుమారుల పాలనలో తెలంగాణ ఎడారిగా మారుతుందని.. నీళ్లు లేక పొట్టకొచ్చిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చుకుంటున్నారని.. ఇంత జరుగుతున్నా గుంపుమేస్త్రీ ప్రభుత్వం ఏం చేస్తుందనీ వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

LRSను ఉచితంగా అమలు చేసేంత వరకు మా పోరాటం ఆగదని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీలు, చైర్మన్ వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ పట్టణ మండల కమిటీ సభ్యులు, పార్టీ పట్టణ వార్డు కమిటీ సభ్యులు, ఇన్చార్జులు, గ్రామ కమిటీలు అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్