అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు) గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగింపు



 హైదరాబాద్, జూన్ 19 :: రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు) గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ హనుమంత రావు ఉత్తర్వలు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వల మేరకు జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్లు ఆయిన జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల కోసం ప్రతి రెండు సంవత్సరాలకోసారి అక్రిడిటేషన్ కార్డుల సదుపాయం రాష్ట్ర సమాచార శాఖ కల్పిస్తున్నది. ఆ గడువు ఈ నెల జూన్ 30 తో ముగిస్తుండగా, గడువు తేదీని సెప్టేంబర్ 30 వరకు పొడిగించినట్లు ఆ ఉత్తర్వులలో తెలిపారు.

----------------------------------------------------------------------

స్పెషల్ కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖచే జారీ చేయనైనది.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్