ఖైరతాబాద్ GHMC జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ వలలో


 ఖైరతాబాద్ GHMC జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ వలలో

హైదరాబాద్, మే 4:

ఖైరతాబాద్ జోన్ పరిధిలోని GHMC సర్కిల్-37లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ వలలో చిక్కింది. అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోమవారం ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే…

రెవెన్యూ/ట్యాక్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీమతి బి. శ్రీలత ఒక వ్యక్తి నుంచి అధికారిక పని చేయించేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మొదటి విడతగా రూ.1 లక్ష స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ సమీపంలో ఆమెను పట్టుకున్నారు.

ఇంటి నిర్మాణ అనుమతి (House Construction Permission) ప్రక్రియలో అనుకూలంగా వ్యవహరించేందుకు ఈ లంచం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

పట్టుబడిన నగదు రూ.1 లక్షను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రసాయన పరీక్షలో ఆమె చేతులపై పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితురాలిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ వెల్లడించింది.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్