తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశంలో అన్ని ఎజెండా అంశాలకు ఆమోదం - సీనియర్ ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్

 




తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశంలో అన్ని ఎజెండా అంశాలకు ఆమోదం - సీనియర్ ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్

హైదరాబాద్, జూన్ 27: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశం శనివారం హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో అధ్యక్షుడు అమరావాది లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించారు.

సమావేశంలో ముందుగా గత సమావేశాల తీర్మానాలను ధృవీకరించడంతో పాటు సంస్థ పరిపాలన, సభ్యత్వ విస్తరణ, జిల్లా కమిటీల ఏర్పాటు, మహాసభ భవిష్యత్ కార్యాచరణ, ఆర్థిక వ్యవహారాలు, సేవా కార్యక్రమాలు, సంస్థ బలోపేతానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా సమావేశ ఎజెండాలో పొందుపరిచిన మొత్తం 15 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సీనియర్ ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్ తెలిపారు.

అలాగే జూలై 4న నిర్వహించనున్న మహాసభ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల ఏర్పాట్లు, సభ్యత్వ నమోదు, జిల్లా కమిటీల బలోపేతం, వివిధ సేవా కార్యక్రమాల అమలుకు సంబంధించిన నిర్ణయాలను కూడా కార్యవర్గం ఆమోదించినట్లు ఆయన వెల్లడించారు.

సంస్థ అభివృద్ధి, ఆర్యవైశ్య సమాజ సంక్షేమం, రాష్ట్రవ్యాప్తంగా మహాసభ కార్యకలాపాల విస్తరణకు ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు దోహదపడతాయని సీనియర్ ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్ పేర్కొన్నారు. సమావేశంలో కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రతినిధులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన