Skip to main content

తెలంగాణా లో అక్షర యోధులకు అవమానాలు, తెలంగాణలో మోసపోయిన జర్నలిస్ట్- టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్


 


 తెలంగాణా లో అక్షర యోధులకు అవమానాలు, తెలంగాణలో మోసపోయిన జర్నలిస్ట్- టీజేయు రాష్ట్ర అధ్యక్షులు  కప్పర ప్రసాద్

*తెలంగాణలో మోసపోయిన జర్నలిస్ట్*

*ఎనిమిదేండ్ల నుంచి సమాచార శాఖకు మంత్రి లేడు, *పూర్తిస్థాయి కమిషనర్ లేడు*

*చతికపడ్డ మీడియా అకాడమీ*

*పెద్ద సారు కలవడు

*అధికారులు మారరు*

*ప్రభుత్వ పక్షాన ఉండే నాయకులు ఆసుపత్రిలో చేరితే సీఎం రిలీఫ్ ఫండ్ లక్షలు

.*గ్రామీణ ప్రాంత పేద జర్నలిస్టులకు ఎందుకు రావు అన్నది ఇదో పెద్ద ప్రశ్న*


హైదరాబాద్:  తెలంగాణ కోసం ఉద్యమించిన సబ్బండ వర్గాలలో జర్నలిస్ట్ లు ముందువరుసలో ఉన్నారని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు  కప్పర ప్రసాద రావు అన్నారు.  1969నుంచి తెలంగాణ కోసం జర్నలిస్ట్ లు ఉద్యమాలను విడవకుండా కొనసాగిస్తూనే ఉన్నారని. ప్రజలను ఉద్యమం లోకి తీసుకు వచ్చేందుకు కృషి సాగించారుని. చాలా మంది సమైక్య వాదుల మనసు మార్చి వారిని తెలంగాణ వాదులుగా తీర్చి దిద్దిన ఘనత జర్నలిస్టులదేనాని,  రాజకీయ ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యమౌతుంది అని భావించిన తరువాత నాయకులను ఉద్యమంలోకి తీసుకు రావడానికి జర్నలిస్టుల దశాబ్దాల కృషి ఉన్నదని. తెలంగాణ సాకారమైతే ప్రజల బతుకుల్లో మార్పు వస్తుందని,సామాజిక,ఆర్థిక,రాజకీయ రంగాల్లో తెలంగాణ అస్మిత కనిపిస్తుందని భావించి ఉద్యమాన్ని నిర్మించడం లో జర్నలిస్టులు తనవంతు కృషి చేశారని పేర్కొన్నారు. కళ్ళు మూసుకు పోయి అధికార మత్తులో జోగుతూ ఆంధ్రా నేతల మూతులు నాకే ఎందరో నాయకులను ఉద్యమంలోకి తీసుకు రావడానికి జర్నలిస్టులు ప్రయత్నించారని, అందులో భాగమే కెసిఆర్ గారి తెలంగాణ ఉద్యమ ఎజెండా. టిడిపి లో ఉంటూ అసెంబ్లీ లో 360 GO అవసరం లేదని వాదించిన వ్యక్తి, చంద్ర బాబే బంగారం అంటూ బానిసత్వాన్ని ప్రదర్శించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు ఉద్యమ పాఠం నేర్పింది జర్నలిస్ట్ లు కాదా అని ప్రశ్నించారు.

 తెలంగాణ నిబద్దత కలిగిన పాశం యాదగిరి లాంటి ఎందరో బుద్ది జీవులు చాలా మంది నేతలను ఉద్యమంలోకి తెచ్చారుని, ఐతే ఆ ఉద్యమంలో రాజకీయ అవసరాలు ఉన్నందు వల్ల కెసిఆర్ కూడా ఆకర్షితులయ్యారని, . దేశపతి శ్రీనివాస్,  కవి నందిని సిద్ధారెడ్డి, సిద్దిపేట ఈనాడు విలేకరి అంజయ్యా, అష్టకాల రాం మోహన్,  సంగారెడ్డి వార్త విలేకరిగా ఉన్న ఆర్. సత్య నారాయణ లు ప్రభావం చూపించారని అన్నారు.  కెసిఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం బలంగానే ఉన్నదిని. అన్నాడు మెదక్ జిల్లా జర్నలిస్ట్ ల సంఘానికి స్వర్గీయ  రామలింగారెడ్డి అధ్యక్షుడు, నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నానని, నేను జహీరాబాద్ లో పనిచేస్తుండగా తెలంగాణ కోసం జర్నలిస్టుల పాటల క్యాసెట్ రూపొందించామని తెలిపారు. దేశపతి శ్రీనివాస్ , దరువు అంజన్న లు పాడిన పాటలతో క్యాసెట్ విడుదల చేయాలని కెసిఆర్ ని ఆహ్వానిస్తే ఆయన ఆసభకు రాలేదని అందుకు వేరే రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పారు. తరువాత కాలంలో అనేకసార్లు నేను, రామలింగ రెడ్డి కెసిఆర్ ని తార్నాక లోని ఇంటిలో కలిసి తెలంగాణ ఉద్యమం లోకి రావాల్సిన అవసరం గురించి వివరించామని. అప్పటికే తెలంగాణ నలుమూలల కలియ తిరుగుతూ తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని వివరిస్తున్న గాదె ఇన్నయ్య తో పాటు అనేక మంది మేధావుల తో చర్చించిన తరువాత కెసిఆర్ తెలంగాణ ఉద్యమానికి ఆరంగేట్రం చేశారుని .తెరాస ఆవిర్భావం తరువాత తెరవెనుక ఉన్న చాలా మంది జర్నలిస్టులు బహిరంగంగా ముందుకు వచ్చారని తెలిపారు. అప్పటికే వామపక్ష భావజాలం తో ఉన్న చాలా మంది గ్రామీణ ప్రాంత విలేకరులు తెలంగాణ ఉద్యమాన్ని బుజాన వేసుకుని నడిపించారని, ఎప్పుడు బలంగా ఉన్న ఎపియుడబ్ల్యూజే  మాత్రం ఉద్యమానికి దూరంగా ఉండటం తో కొంతమంది తెలంగాణ వాదులుము కలిసి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేసి అల్లం నారాయణ కన్వీనర్ గా ముందుకు పోయామని, ఫోరం తెరాస అనుబంధంగా మారడం, వామపక్ష భావజాల ము తప్ప ఇతరుల అభిప్రాయాలను గౌరవించక పోవడం తో  తెలంగాణ జర్నలిస్ట్ లకు ఒక ప్రత్యేక సంఘం ఉండాలన్న అవసరం కొద్ది తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు జరిగిందిని తెలిపారు.  సిద్ధాంత వైరుధ్యాలు, అభిప్రాయ బెదాలే తప్ప ఎవరితోటి విరోధం లేదని. ఉద్యమం లో అందరినీ కలుపుకొని పోయే స్వభావం తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ కు ఉన్నదని. ఇప్పటికీ అదే ఉరవడి కొనసాగుతున్నదని ఆయన తెలిపారి ఉద్యమ సమయంలో జేఏసీ ఆవిర్భావం కోదండరాం  సారథ్యం ఇలా అన్ని అంశాలలో జర్నలిస్టుల పాత్ర చాలా ఉన్నదని యాజమాన్యాలు అనుకూలంగా లేక పోయిన,ఉద్యోగాలు పోతాయని తెలిసినా, కేసులు ఐనా వెనకడుగు వెయ్యకుండా ఉద్యమం నడిపించారుని. ఇందులో నేను కొందరి పేర్లు మాత్రమే రాశాను కానీ తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే విలేకరులు అందరూ చిత్తశుద్ది తో ఉద్యమంలో పాల్గొన్నారని,  కాదు వారే ముందుండి నడిపించారు అనడం కరెక్ట్ అని పేర్కొన్నారు. ఇదంతా ఎందుకు చేశామో తెలుసని,  ప్రజలతో మమేకమైన వారిగా వారి సమస్యలతో పాటు, ఆత్మ గౌరవం, జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కార మౌతాయని భావించారని. కానీ అవేవీ జరగలేదు. అధికార మార్పిడి తప్ప ఆత్మ గౌరవం కూడా కరువైందని విమర్శించారు. వైఎస్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం లో జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు ఇచ్చారు. ఎనిమిదేండ్ల తెలంగాణలో ఇండ్ల స్థలాల మాటే మరిచి పోయిన పరిస్తితి ఉన్నదని, హెల్త్ కార్డులు లేక ఎందరో జర్నలిస్టులు అసువులు బాసారని,  ప్రభుత్వం వద్ద పైరవీలు చేసే జర్నలిస్ట్ లకు తప్ప ఎవ్వరికీ ఎలాంటి సహాయము అందటం లేదని వాపోయారు.ఎవరికైనా ప్రమాదం జరిగితే ఇక అంతే వారి కుటుంబం రొడ్డున్న పడ్డట్టేనని, ఎందరో తమ్ముళ్లు ఫేస్ బూక్లో లో పోస్ట్ పెడతారుని. ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉన్నాను సహాయం చెయ్యండి అని, కరోనా సమయంలో ఐదు కిలోల బియ్యం కోసం సంచులు పట్టుకొని దాతల ఇండ్ల ముందు పడికాపులు కాసిన వారెందరో. ప్రభుత్వ పక్షాన ఉండే నాయకులు ఆసుపత్రిలో చేరితే సీఎం రిలీఫ్ ఫండ్ లక్షలు ఎలా వస్తాయి అదే. గ్రామీణ ప్రాంత పేద జర్నలిస్టులకు ఎందుకు రావు అన్నది ఇదో పెద్ద ప్రశ్నేనని, ఇండ్ల స్థలాలు ఒక నాయకుడికి మూడు,నాలుగు వస్తాయి. అడిగిందే తడువుగా నిబంధనలకు విరుద్ధంగా వారి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. కానీ నిక్కార్శైన, కాలాన్నే నమ్ముకున్న వారికి ఎందుకు రావని ప్రశ్నించారు.  జర్నలిస్టుల వైద్యం, వారి పిల్లలకు విద్యా, ఇంటిస్తలం, ఉద్యోగ భద్రత, చిన్న పత్రికలకు, చానల్లకు ప్రకటనలు, భావ ప్రకటన స్వేచ్ఛా, భద్రత తదతర అంశాలు ఎందుకు చర్చకు రావడం లేదని అన్నారు ఆత్మ గౌరవం కూడా కరువైందని, సీఎం  విలేకరుల సమావేశంలో అవమానిస్తూ మాట్లాడితే ఎవరికి చెప్పుకోవాలని, పాలాభిశేకాలు, పాదాభివందనాలు ఎవరికోసం చేస్తున్నారని,చివరకు అక్రీడేషన్ కార్డ్ ల కోసం కూడా ఇబ్బందులే..పైరవీలు చేస్తేనే కార్డ్ ఇస్తున్న పరిస్తితని,

ఇంకా ఉపెక్షితే తెలంగాణలో పరిస్తితి మరింత దిగజారే అవకాశం ఉందిని తెలిపారు.

23నుంచి జాతీయ కౌన్సిల్

జర్నలిస్ట్ ల సమస్యలపై చర్చించి ఒక కార్యాచరణ రూపొందించాల్సి ఉన్నదని, తెలంగాణ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల పరిస్థితులను కూడా చర్చించేందుకు  ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ . జాతీయ కౌన్సిల్ సమావేశాలు హైదరాబాద్ లో జరుగు తున్నాయని 23,24తేదీలలో జరిగే ఈ సమావేశాలలో దేశం నలుమూలల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారని తెలిపారు.

ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్  అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జునయ్యా, సెక్రెటరీ జనరల్ పరమానంద పాండే లు మార్గ దర్శనం చేస్తారని. పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై మాట్లాడతారని, ఈ సమావేశాలను జయప్రదం చెయ్యాల్సింది గా జర్నలిస్ట్ లకు విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్