Skip to main content

*బిజెపి ని ఓడించడం ద్వారానే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి*

 

*బిజెపి ని ఓడించడం ద్వారానే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి*

*దళితుల సమస్యలను ఎన్నికల మ్యానిఫెస్టోలలో చేర్చాలి*

*దళితుల్లో చైతన్యం కల్పించడం కోసం ప్రజా సంఘాలు, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో నల్గొండలో కోటి సంతకాల సేకరణ.*

నలగొండ: 

భారత రాజ్యాంగ స్థానంలో మను అధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తున్న బిజెపిని తిరిగి అధికారంలో రాకుండా ఓడించడం ద్వారానే రాజ్యాంగాన్ని కాపాడుకోగలమని అట్టడుగు వర్గాలైన దళితుల్లో చైతన్యం కల్పించడం కోసం ప్రజా సంఘాలు సమాజిక సంఘాల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ అని దళిత్ సమ్మిట్ రాష్ట్ర నేతలు నారి ఐలయ్య పాలడుగు నాగార్జున బోల్గూరి నరసింహ ఊరు పక్క వెంకటయ్యలు  పిలుపునిచ్చారు.
  ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రం సుభాష్ విగ్రహం వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వారు మాట్లాడుతూ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద పెద్ద ఎత్తున దాడులు దౌర్జన్యాలు పెరిగాయని అన్నారు బాధితులకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వం దాడులు దౌర్జన్యాలకు తెగబడుతున్న పెత్తందారులకు కొమ్ముకాస్తున్నది భారత రాజ్యాంగ హక్కులను అమలు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధపడటం లేదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నది  కార్పొరేట్ బహుళజాతి కంపెనీల ఒత్తిడికి తల్లోగ్గి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ప్రభుత్వ రంగ పెట్టుబడిలను ఉపసంహరించుకోవడం చేస్తుందని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలు చేయడం లేదన్నారు విస్తారమైన ప్రైవేట్ రంగంలో ఉపాధిలో రిజర్వేషన్ల అమలు చేయకపోవడం వలన ఉన్నత విద్య చదివిన దళిత విద్యార్థులు ఉపాధిక దూరం అవుతున్నారని అన్నారు అభివృద్ధి పేరుతో జరుగుతున్న భూసేకరణలో దళితుల చేతుల్లో ఉన్న అసైన్మెంట్ భూములన్ని కేంద్రీకరించి లాక్కుంటున్నారు గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పెత్తందారుల ఒత్తిడి  వలన ఉపాధి పనికి నిధులు తగ్గించి పనిని ఎత్తేయాలని కుట్ర చేస్తున్నది పట్టణాలలో ఉపాధి పని పెట్టాలని చేస్తున్న డిమాండ్ ను పట్టించుకోవడం లేదు తెలంగాణలో దళితులకు మూడు ఎకరాల భూమి పంచుతామని ప్రభుత్వం చేతులెత్తేసింది పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధపడటం లేదు కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై నడిరోడ్డు మీద పెతందారిలో నరికి చంపుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటరాని తనం కుల వివక్షను పాలకులే పెంచి పోషిస్తున్నారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధపడటం లేదన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు మంత్రి కోనేరు రంగారావు కమిటీ భూ సిఫార్సులను అమలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడలేదన్నారు. దళితుల సమస్యలను ఎన్నికల ఏజెండాలలో చేర్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు

ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు అల్లి సుభాష్ యాదవ్ పందుల సైదులు గౌడ్ లోదంగి శ్రావణ్ కుమార్  కెవిపిఎస్ పట్టణ కార్యదర్శి గాదె నరసింహ బొల్లు రవీందర్ కుమార్ పుచ్చకాయల నర్సిరెడ్డి నడపరాజు సైదులు భూతం అరుణ కుమారి గోలి నరసింహ తదితరులు పాల్గొన్నారు.




Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్