ఓట్ల లెక్కింపు కేంద్రం తనిఖీ చేసిన కేంద్ర ఎన్నికల పరిశీలకులు


 నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న లోక సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గురువారం కేంద్ర ఎన్నికల పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి, కళ్యాణ్ కుమార్ దాస్, ఆమోగ్ జీవన్ గాంకర్లు జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తిలతో కలిసి గురువారం తనిఖీ చేశారు.


        ఈ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు కై ఏర్పాటు చేసిన బారికేడింగ్, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు హాళ్లను తనిఖీ చేశారు.


       ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మానిక్ రావ్ సూర్యవంశి ఓట్ల లెక్కింపుకు వినియోగించనున్న టేబుల్లు, పోలింగ్ కేంద్రాలు, సిసి టీవీల ఏర్పాటు తదితర వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ ల ద్వారా అడిగి తెలుసుకున్నారు .

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్