🔥 తిరుమల VIP సేవల పేరుతో భారీ మోసం బహిర్గతం 🔥
🔥 తిరుమల VIP సేవల పేరుతో భారీ మోసం బహిర్గతం 🔥
హైద్రాబాద్:
“ఆ చానెల్లో మామ పనిచేస్తాడు…” అంటూ నమ్మించి, తిరుమలలో వీ ఐ పి సేవలు కల్పిస్తానని చెప్పి పలువురిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
అభిషేకం, సుప్రభాత దర్శనాల పేరుతో 14 మంది భక్తుల నుంచి సుమారు రూ. 3.70 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదట టికెట్లు ఏర్పాటు చేస్తానని చెప్పిన నిందితుడు, తర్వాత “టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి… నాలుగు రోజులు ఆగండి” అంటూ కాలయాపన చేసి, మరింత డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘరానా మోసానికి పాల్పడిన వ్యక్తి వినయ్ గౌడ్ ఆలూరి అని బాధితులు తెలిపారు. టికెట్ డబ్బులు తిరిగి వస్తాయని చెప్పి కాలయాపన చేస్తూ బాధితులను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మోసాన్ని గ్రహించిన బాధితుడు బాలాజీ, Banjara Hills Police Stationలో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
VIP దర్శనాల పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Comments
Post a Comment