*నల్గొండలో వినాయక ఉత్సవాలకు పోలీసుల సూచనలు - ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని డీఎస్పీ శివరాం రెడ్డి విజ్ఞప్తి*


 *నల్గొండలో వినాయక ఉత్సవాలకు పోలీసుల సూచనలు - ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని డీఎస్పీ శివరాం రెడ్డి విజ్ఞప్తి*


*నల్లగొండ:* వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి సూచించారు.


శాంతి సంఘ సభ్యులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు సూచనలు చేశారు.


- ప్రతి గణేష్ మండపాన్ని తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.

- ఊరేగింపులు, నిమజ్జనం సందర్భంగా మద్యం సేవించడం, డ్రంక్ డ్రైవింగ్ వంటివి చేయరాదు.

- ఫేక్ న్యూస్, వదంతులు, రెచ్చగొట్టే పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. అలాంటి వాటిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.

- నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

- డీజేలు, సౌండ్ సిస్టమ్‌ల విషయంలో నిబంధనలు పాటించాలి.

- ఇతరుల మనోభావాలకు భంగం కలిగించేలా వ్యవహరించవద్దు.


*"ఉత్సవాలను సోదరభావంతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుందాం. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం"* అని డీఎస్పీ శివరాం రెడ్డి విజ్ఞప్తి చేశారు.


_

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*