Posts

జీహెచ్ఎంసీ టిడిఆర్, బిల్డ్ నౌ విధానాలను ప్రశంసించిన జైపూర్ అభివృద్ధి సంస్థ అధికారులు

Image
జీహెచ్ఎంసీ టిడిఆర్, బిల్డ్ నౌ విధానాలను ప్రశంసించిన జైపూర్ అభివృద్ధి సంస్థ అధికారులు* – హెడ్ ఆఫీస్ లో టిడిఆర్ పాలసీ, ‘బిల్డ్ నౌ’, లేఅవుట్ అనుమతి వ్యవస్థలపై GHMC కమిషనర్ బృంద సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హైదరాబాద్, జూలై 24, 2025: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలు చేస్తున్న టిడిఆర్, బిల్డ్ నౌ విధానాలను జైపూర్ అభివృద్ధి సంస్థ కమిషనర్, అధికారులు ప్రశంసించారు. గురువారం జైపూర్ అభివృద్ధి సంస్థ (JDA) కమిషనర్ ఆనంది నేతృత్వంలోని ప్రణాళిక డైరెక్టర్ ప్రీతి గుప్తా, ఐటీ సలహాదారు ఆర్.కె. శర్మా, అసిస్టెంట్ టౌన్ ప్లానర్ రుషికేష్ కొల్టే, ఐటీ డిప్యూటీ డైరెక్టర్ పంకజ్ శర్మ లతో కూడిన ప్రతినిధి బృందం ట్రాన్స్ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (TDR) పాలసీ, బిల్డ్ నౌ (Build Now) అనే ఏకీకృత భవన మరియు లేఅవుట్ అనుమతి వ్యవస్థ ల అధ్యయనం కోసం GHMC ను సందర్శించారు .  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో బృందానికి అధికారులు స్వాగతం పలికారు.  ప్రధాన కార్యాలయంలో కమిషనర్ శ్రీ ఆర్.వి. కర్ణన్ TDR పాలసీ ,2017 లో ప్రవేశపెట్టిన నూతన టిడిఆర్ పాలసీ ముఖ్యాంశాలు, పాలసీ ప్రయోజనాలు,  భవన, లేఅవుట...

ఏ నిమిషం కూడా జర్నలిస్టులను మర్చిపోను... విస్మరించను- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Image
 ఏ నిమిషం కూడా  జర్నలిస్టులను మర్చిపోను... విస్మరించను- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* - *వచ్చే సోమ, మంగళ వారాల్లో నూతన అక్రిడేషన్ జారీ విధివిధానాలపై చర్చిద్దాం* - *ఇండ్ల స్థలాల జారీ ప్రక్రియ కోర్టు పరిధిలోని అంశం* - *ఎలా చేస్తే జర్నలిస్టులకు మేలు చేకూరుతుందో... న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నాం* - *టీయూడబ్ల్యూజే (ఐజేయూ) 4వ జిల్లా మహాసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* *వైరా : ఏ నిమిషం కూడా జర్నలిస్టులను మర్చిపోను... విస్మరించనని... ఇందిరమ్మ ప్రభుత్వ ఏర్పడ్డంలో జర్నలిస్టుల పాత్ర కూడా కీలకమని.... గత 18నెలలుగా ప్రజాపాలన సజావుగా సాగడంలో వారి సహకరం ఉందని... వారి న్యాయపరమైన కోరికలు తీర్చడానికి ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. వైరాలోని శబరి గార్డెన్స్లో గురువారం జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) 4వ జిల్లా మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... రంగ రంగ వైభవంగా వైరా పట్టణంలో ఏర్పాటు చేసుకున్న ఐజేయూ మహాసభకు నేను రావ...

వరద నీరు నిల్వకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సత్వర చర్యలు చేపట్టాలి - జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్

Image
 వరద నీరు నిల్వకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సత్వర చర్యలు చేపట్టాలి - జీహెచ్‌ఎంసీ కమిషనర్  ఆర్..వి. కర్ణన్  *–నగరంలోని వరద ముప్పు ప్రాంతాల్లో కమిషనర్ క్షేత్ర పర్యటన, అధికారులకు సూచనలు* హైదరాబాద్ 23, జులై,2025: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వర్షపు నీరు నిలుస్తూ తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న ప్రాంతాలను గుర్తించి వెంటనే క్లియర్ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్  ఆర్.వి. కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్  ఆర్.వి. కర్ణన్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్  గజరావు భూపాల్, జోనల్ కమిషనర్ (సెరిలింగంపల్లి జోన్)  భోర్ఖడే హేమంత్ సహదేవరావు,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ , సిబ్బందితో కలిసి సెరిలింగంపల్లి జోన్ లో క్షేత్ర పరిశీలన చేశారు. మెడికవర్ హాస్పిటల్ సమీపంలోని జూబ్లీ ఎన్‌క్లేవ్ కమాన్ వద్ద వరద నీటి డ్రైనేజీని కమిషనర్ పరిశీలించారు. ఆ తర్వాత, శిల్పరామం ఎదురుగా ఉన్న తమ్మిడికుంట లేక్స్ ఔట్‌లెట్ పాయింట్‌ను సందర్శించారు. తదుపరి, హై-టెక్ సిటీలోని యశోద హాస్పిటల్ రోడ్డుపై స్మైలైన్ డెంటల్ వద్ద నీటి నిల్వ పాయింట్‌ను పరిశీలించారు. స్మైలైన్ డెంటల్...

ఆగస్టు 3న జరిగే వైశ్య రాజకీయ రణభేరి నీ విజయవంతం చేద్దాం: కాచం సత్యనారాయణ గుప్త.

Image
 స్థానిక సంస్థల్లో వైశ్యులకు వాటా తేల్చాల్సిందే  .  ఆగస్టు 3న జరిగే వైశ్య రాజకీయ రణభేరి నీ విజయవంతం చేద్దాం:  కాచం సత్యనారాయణ గుప్త. హైద్రాబాద్, గూఢచారి:  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల వాటా తేల్చాల్సిందేనని, ఆగస్టు 3 వ తేదీన హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వైశ్య రాజకీయ రణభేరి నీ విజయవంతం చేద్దామని వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కాచం సత్యనారాయణ గుప్త అన్నారు. మంగళవారం చైతన్యపురిలోని వైశ్య వికాస వేదిక కార్యాలయంలో వైశ్య జర్నలిస్టు లతో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైశ్య వికాస వేదిక స్థాపించి దాదాపు ఏడు సంవత్సరాల అయిందని తెలిపారు. ఏడు సంవత్సరాల కాలంలో ఈ వేదిక ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించమని, కరోనా సమయంలో ఎంతోమంది నిరుపేదలకు నిత్యవసర వస్తువులు అందచేయడం జరిగిందన్నారు. వైశ్య పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో 90 శాతం దాటిన విద్యార్థినీ, విద్యార్థులకు మెమొంటో , సర్టిఫికెట్ , శాలువాతో సన్మానించడం జరిగిందని తెలిపారు.   రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల వాటా తేల్చాలని అన్నారు. వైశ్యు...

నల్గొండ జిల్లాలో ప్రస్తుతం ఎరువుల కొరత లేదు- జిల్లా కలెక్టర్ త్రిపాఠి

Image
నల్గొండ జిల్లాలో ప్రస్తుతం ఎరువుల కొరత లేదు-  జిల్లా కలెక్టర్ త్రిపాఠి  నల్గొండ:   నల్గొండ జిల్లాలో ప్రస్తుతం ఎరువుల కొరత లేదని జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఉద్ఘాటించిన జిల్లాకలెక్టర్ త్రిపాఠి ప్రకారం వ్యవసాయేతర అవసరాలకు యూరియాను ఉపయోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించే దుకాణ యజమానులు, ఇతరులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అదనంగా, ఆమె ఎరువుల సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ (18004251442)తో పాటు "ఎరువుల ఫిర్యాదుల కేంద్రం"ని ప్రారంభించారు.

వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా చూడండి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Image
  వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా చూడండి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి  నల్గొండ:  వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైతులు ఇబ్బందులు పడకుండా ఎరువుల సక్రమ సరఫరా,సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల ద్వారా సక్రమ నీటి నిర్వహణ, రేషన్ కార్డుల పంపిణీ, తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.        సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి మంత్రులు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.        వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులకు ఆయా అంశాలపై దిశానిర్దేశం చేస్తూ... రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధుల నివారణ  భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడడం, నీటిపారుదల ప్రాజెక్టులు చెరువుల ద్వారా సరైన విధంగా నీటిని వినియోగించుకోవడం, రేషన్ కార్...

10 వ త‌ర‌గతిలో ఉత్తీర్ణులైన ప్ర‌తి విద్యార్థి త‌ప్ప‌నిస‌రిగా ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి - ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

Image
 10 వ త‌ర‌గతిలో ఉత్తీర్ణులైన ప్ర‌తి విద్యార్థి త‌ప్ప‌నిస‌రిగా ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి - ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద్రాబాద్:  ప‌దవ త‌ర‌గతిలో ఉత్తీర్ణులైన ప్ర‌తి విద్యార్థి త‌ప్ప‌నిస‌రిగా ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. 10 వ త‌ర‌గ‌తిలో పెద్ద సంఖ్య‌లో ఉత్తీర్ణ‌త క‌నిపిస్తున్నప్పటికీ ఇంట‌ర్మీడియ‌ట్ పూర్త‌య్యే స‌రికి ఆ సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిపోవ‌డానికి గ‌ల కారణాలను అధ్యయనం చేసి వాటి ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని సూచించారు.  ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) లో ముఖ్యమంత్రి విద్యా శాఖ‌పై సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఇంట‌ర్మీడియ‌ట్ ద‌శ కీల‌క‌మైనందున‌, ఆ ద‌శ‌లో విద్యార్థికి స‌రైన మార్గ‌ద‌ర్శ‌క‌త్వం అందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం గారు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇత‌ర రాష్ట్రాల్లో 9 వ త‌ర‌గ‌తి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు అమలు చేస్తున్నారని, అందువల్ల అక్క‌డ డ్రాపౌట్స్ సంఖ్య త‌క్కువ‌గా ఉంద‌ని అధికారులు వివరించారు.  అలాంటి రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానా...