ఏసీబీ పట్టుబడ్డ తహసీల్దార్
ఏసీబీ పట్టుబడ్డ తహసీల్దార్
నల్గొండ జిల్లా:
చిట్యాల మండల తహసీల్దార్ గుగులోత్ కృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధి కారులు వెల్లడించిన వివరాల మేర కు...గుండ్రంపల్లి గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమికి సంబంధించన మ్యూటేషన్ కోసం రూ.2లక్షలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించాడు.
తహసీల్దార్ కార్యాలయంలో వ్యూ హం ప్రకారం మాటువేసిన ఏసీబీ అ ధికారులు గురువారం తహసీల్దార్ గుగులోత్ కృష్ణా, మరో ప్రైవేట్ వ్య క్తి లంచం తీసుకుంటుండగా పట్టు కున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకుని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని వెల్లడించా రు.
Comments
Post a Comment