ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పోజర్లో భాగంగా పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థుల TGPCB సనత్నగర్ సందర్శన


 

ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పోజర్లో భాగంగా పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థుల TGPCB సనత్నగర్ సందర్శన

హైద్రాబాద్: 

నాగర్కర్నూల్ జిల్లా పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థులు తమ పర్యావరణ శాస్త్రం మరియు విపత్తు నిర్వహణ) కోర్సు ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పోజర్లో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సనత్నగర్ ను సందర్శించారు.

ఈ సందర్భంగా  పి. శరత్, పర్యావరణ శాస్త్రవేత్త, విద్యార్థులతో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ప్లాస్టిక్ కాలుష్యం, బయోమెడికల్ వ్యర్థాల కాలుష్యం, మురుగునీటి శుద్ధి విధానాలు వంటి వివిధ కాలుష్య రకాలపై సమగ్ర అవగాహన కల్పించారు.

అలాగే పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు విధించే జరిమానాలు మరియు శిక్షలు గురించి వివరించి, పరిశ్రమలు మరియు సంస్థలు పర్యావరణ ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు.

ప్రాక్టికల్ ఎక్స్పోజర్లో భాగంగా విద్యార్థులను TGPCB ప్రయోగశాల సౌకర్యాలను చూపించి, వాయు మరియు నీటి కాలుష్య స్థాయులను కొలిచే పరికరాలు, శాస్త్రీయ పద్ధతులు గురించి వివరించారు. ఈ సందర్శన ద్వారా విద్యార్థులకు కాలుష్య పర్యవేక్షణ వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ పద్ధతులు, పర్యావరణ పరిరక్షణ చర్యలు పై ప్రత్యక్ష అవగాహన కల్పించారు.

ఈ సందర్శనలో పాలెం వ్యవసాయ కళాశాలకు చెందిన అధ్యాపకులు అభిలాష్, పరమేష్ మరియు విద్యార్థులు పాల్గొని, ఇంటరాక్టివ్ సెషన్లో చురుకుగా పాల్గొన్నారు.

ఈ ఫీల్డ్ విజిట్ విద్యార్థులకు ఎంతో సమాచారభరితంగా, ఉపయోగకరంగా నిలిచి, సిద్దాంతపరమైన జ్ఞానాన్ని వాస్తవ ప్రపంచ పర్యావరణ నిర్వహణ విధానాలతో అనుసంధానించడంలో ఉపయోగకరమని విద్యార్థులు అన్నారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్