Posts

Showing posts from August, 2025

మహా..ప్రభో మా మొర వినండి టెన్షన్ వద్దు..పెన్షన్ కావాలి *మాచన రఘునందన్*

Image
 మహా..ప్రభో మా మొర వినండి టెన్షన్ వద్దు..పెన్షన్ కావాలి *మాచన రఘునందన్* ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంచార్జ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (న్యూ పెన్షన్ స్కీమ్) రద్దు కోసం.. రేపు హైదరాబాద్ లో కార్యక్రమం తల పెట్టినట్టు నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టారేశన్ యునైటెడ్ ఫ్రంట్ దక్షిణ భారత ఇన్ ఛార్జ్ మాచన రఘునందన్ తెలిపారు.న్యూ పెన్షన్ స్కీమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో తేడా ల ను "మాచన" ఆదివారం నాడు నాడు వివరించారు. తమ పింఛను వ్యధ, భాధ ను పంచుకున్నారు. భాగస్యామ్య పింఛను పథకం, ఉద్యోగుల పాలిట ఓ టెన్షన్ స్కీమ్ అని, ఉద్యోగులు సి పి ఎస్ ను ఎందుకు వద్దు అనుకుంటున్నారో..పాత పింఛను పథకం నే మళ్లీ ఎందుకు కొరుకుoటున్నారో.. "మాచన" మాటల్లోనే.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనబడే భాగస్వామ్య పింఛను పథకం ను,ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నది సెప్టెంబర్ 1 2004 నుంచి.  ఆ రోజు నుంచి తమకు ఇక ప్రభుత్వ పెన్షన్ యోగం రాదు అనే వ్యధ ను మిగిల్చింది.ఉద్యోగం ఒక యోగం ,ప్రజా సేవా అవకాశం మహత్బాగ్యం అని భావించడం పరిపాటి. కానీ ఇప్పటి ఉద్యోగికి నౌకరీ ఉన్నదన్న ధీమా నే గాని పాటు సైడ్ ఎఫెక్ట్ లా కాన్ట్రిబ్...

జేఏసీ చైర్మన్ tngos జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి ని కలిసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్

Image
 నలగొండ జిల్లా జేఏసీ చైర్మన్ tngos జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి  ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జిల్లా అధ్యక్షులు కి వివిధ అంశాలు వివిధ సమస్యలు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది రైతులకు మరియు ఉద్యోగస్తులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి సంఘ పక్షాన ఎలాంటి అవసరం ఉన్న వారికి ఎప్పుడూ అన్ని రకాలుగా అండగా ఉంటానని tngo అధ్యక్షులు వారు తెలియజేయడం జరిగింది   బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు ప్రశాంత్ రాష్ట్ర గౌరవ సలహాదారులు కందుల విజయ్ కుమార్ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ జిల్లా కరీంనగర్ కొండన్న కోకన్వీనర్ వినోద్ రాష్ట్ర కార్యదర్శి బాకీ తరుణ్

ఏసీబీ కి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి & సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లలో తనకీ లు నిర్వహించిన ఏసీబీ

Image
  ఏసీబీ కి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి &   సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లలో తనకీ లు నిర్వహించిన ఏసీబీ 29.08.2025న, కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శి (AO) శ కుంబం నాగరాజిని ACB కరీంనగర్ యూనిట్ చల్లూరు గ్రామంలోని గ్రామ పంచాయతీ వద్ద రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది, అతను ఫిర్యాదుదారుడి నుండి అధికారిక అనుకూలంగా వ్యవహరించడానికి అంటే "ఫిర్యాదిదారుడు కొత్తగా నిర్మించిన ఇంటికి ఇంటి నంబర్ కేటాయించడానికి" రూ. 20,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించాడు. AO వద్ద నుండి తీసుకున్న కళంకిత లంచం మొత్తం రూ. 20,000/- అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. అందువలన, AO తన విధులను అనుచితంగా మరియు నిజాయితీ లేకుండా నిర్వర్తించి, అనవసరమైన ప్రయోజనాన్ని పొందాడు. అందువల్ల, AO ని అరెస్టు చేసి, కరీంనగర్‌లోని SPE & ACB కేసుల గౌరవనీయ ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నాము. కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచాము.   సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లలో తనకీ లు నిర్వహించిన ఏసీబీ  ఈరోజు అనగా 29.08.2025 న ...

"మాచన"మాటలతొనే "స్మోకింగ్ మానేశాం.!"

Image
 "మాచన"మాటలతొనే "స్మోకింగ్ మానేశాం.!" జనం లో ఈ స్పందననే గొప్ప పురస్కారం  టుబాకో కంట్రోల్ "హీరో" అవార్డ్ గ్రహీత  మాచన రఘునందన్  స్మోకింగ్..ఎంతో మంది జీవితాల్లో అంధకారం కు కారకమౌతోంది, చేతనైనంత వరకు సమాజం లో మార్పు కోసం ప్రయత్నం చేద్దాం.. అనే సంకల్పం తో నే ముందు కు వెళ్తున్న తప్ప జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డు వస్తుందని ఏ నాడు అనుకోలేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ,పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రోత్బలం తో చండీగఢ్ లోని సైఫర్(స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్) ప్రదానం చేసిన నేషనల్ టుబాకో కంట్రోల్ హీరో అవార్డ్ ను ఈ రోజు తన మాతృమూర్తి చేతుల మీదుగా స్వీకరించారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. తనయుల ఉన్నతి నే కన్న వాళ్లు కోరుతారని,వాళ్ళ కోసం ఐనా చెడు అలవాట్లకు గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ సూచించారు.20 ఏళ్ళ కృషి ఫలితాన్ని అవార్డు రూపం లో అమ్మ చేతులు మీదుగా..అందుకోవడం మహదానందం అని రఘునందన్ అన్నారు. దేశ వ్యాప్తంగా  1000 వైద్య నిపుణులు పోటీ పడ్డ ఈ అవా...

*మట్టి వినాయకులను పూజిద్దాం,పర్యావరణాన్ని కాపాడుదాం- మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*

Image
*ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు* *మట్టి వినాయకులను పూజిద్దాం,పర్యావరణాన్ని కాపాడుదాం- మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*   నల్గొండ: వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. మంగళవారం నాడు మంత్రి నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...   నల్గొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సుమారు 4100  మట్టి వినాయకులను ప్రజలకు ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని ప్రజలందరూ వాతావరణ కాలుష్యం కాకుండా మట్టి వినాయకులను పూజించాలని తెలిపారు. దీనివల్ల వాతావరణ సమతుల్యంతో పాటు,వినాయకులను నిమజ్జనం చేసే చెరువులు కలుషితం కాకుండా ఉంటాయని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన వినాయక విగ్రహాలను వాడడం వల్ల అన్ని రకాలుగా హానికరమని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మ...

*ఎకో ఫ్రెండ్లీ వినాయకులను పూజిద్దాం : మేయర్ గద్వాల విజయలక్ష్మి*

Image
 *ఎకో ఫ్రెండ్లీ వినాయకులను పూజిద్దాం : మేయర్ గద్వాల విజయలక్ష్మి* గణేష్ చతుర్థిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారం బంజారాహిల్స్ మేయర్ క్యాంప్ కార్యాలయంలో డెప్యూటీ కమిషనర్ సమ్మయ్య తో కలిసి స్థానికులు, విద్యార్థులకు మేయర్ మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. మట్టి గణపతే... మహా గణపతి అని...మట్టి గణపతులను ప్రతిష్టించి ,పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు

ACB వలలో పోలీస్ ఇన్స్పెక్టర్ & జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు

Image
 ACB వలలో పోలీస్ ఇన్స్పెక్టర్ & జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు  ACB కి చిక్కిన జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు  25.08.2025న, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు (AO) ఉల్లోజు నర్సింహారావు తన కార్యాలయ గదిలో ఫిర్యాదుదారుడి నుండి అధికారిక సహాయం కోసం, అంటే సరైన ఇన్‌వాయిస్ మరియు "0" ఫారమ్ లేకుండా యూరియా సంచులను విక్రయించినందుకు ఫిర్యాదుదారుడి దుకాణంపై ఎటువంటి చర్య (చట్టపరమైన/విభాగపరమైన చర్యలు) ప్రారంభించనందుకు రూ. 25,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. AO దగ్గర నుండి లంచంగా తీసుకున్న రూ. 25,000/- లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందువల్ల, AO తన విధులను సక్రమంగా మరియు నిజాయితీ లేకుండా నిర్వర్తించి, అనవసరమైన ప్రయోజనాన్ని పొందాడు. అందువల్ల, AO ని అరెస్టు చేసి, వరంగల్‌లోని SPE & ACB కేసుల గౌరవనీయ ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నాము. కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచారు. *. *. *. *. *. *. ...

పర్యావరణ హితంగా గణేష్ చతుర్థి జరుపుకుందాం: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

Image
 *పర్యావరణ హితంగా గణేష్ చతుర్థి జరుపుకుందాం: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి* *హైదరాబాద్, ఆగస్టు 23:* పర్యావరణ హితంగా, ఘనంగా గణేష్ చతుర్థిని జరుపుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగర ప్రజలను కోరారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులకు, సిబ్బందికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తో కలిసి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... గణేష్ చతుర్థి పది రోజుల పాటు జరిగే ముఖ్యమైన పండుగ అని పేర్కొన్నారు. ఈ పండుగను పర్యావరణ పరిరక్షణకు మద్దతుగా జరుపుకోవడమే జీహెచ్ఎంసీ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలియజేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శానిటేషన్, వీధి లైట్లు, చెట్ల కొమ్మల తొలగింపు, రోడ్డు మరమ్మత్తులు, నిమజ్జన ఏర్పాట్లలో క్రేన్లు, కంట్రోల్ రూములు, బేబీ పాండ్ లు, ఎక్సవేటరీ పాండ్ లు, తాత్కాలిక పాండ్ ల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శోభాయాత్రల సందర్భంగా శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి తీసుకుంటామని తెలిపారు. 25 వేల మంది కార్మికులు మ...

*అతడసామాన్యుడు*.. టుబాకో కంట్రోల్ "హీరో".!

Image
 *అతడసామాన్యుడు*.. టుబాకో కంట్రోల్ "హీరో".! నేషనల్ టుబాకో కంట్రోల్ "హీరో" సివిల్ సప్లైస్ డిటి *మాచన రఘునందన్*  అతను.."చరిత్ర సృష్టిస్తా.!"అనుకోలేదు.కానీ అతని నిస్వార్థ సేవ, అలుపెరుగని కృషి,పట్టుదల పొగాకు పై పోరాటం తో..జాతీయ స్థాయిలో అత్యున్నత "హీరో" అవార్డు కు ఎంపిక అయ్యేలా దోహదపడ్డాయి."సార్ నో స్మోకింగ్ ప్లీజ్.!" అని  22 ఏళ్లుగా చేస్తూనే ఉన్న ప్రార్ధన కు యావత్ భారతం అవాక్కయింది. ఇలాంటి వారూ..ఇండియా లో ఉన్నారా?! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఏళ్ల అనుభం ఉన్న వైద్యులు. మేము రోగి కి చికిత్స చేస్తున్నాం. "మాచన" మాత్రం సమాజానికి చికిత్స చేస్తున్నారు.అని శ్లాఘించారు. మిస్టర్ మాచన రఘునందన్ యు అర్ ఎ టుబాకో కంట్రోల్ "హీరో" అని పేర్కొన్నారు. రఘునందన్ ఫోటో ను స్టాంప్ తీర్చి దిద్ది, ఓ వ్యక్తి హీరో ఎలా అయ్యారు, అంతర్జాతీయ స్థాయిలో ఎందరో టుబాకో కంట్రోల్ హీరో ల తో సరిసమానంగా చేరాడు..అని చెప్పడానికి ఓ అంతర్జాతీయ సంస్థ రఘునందన్ గురించి ఎంతో సమయాన్ని వెచ్చించింది. ఈ అంత ఆషా మాషి కాదు. ఎక్స్ట్రార్డినరీ. అసాధారణం. ఓ సామాన్యుడు తన అసామాన...

ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మహబుబాబాద్ జిల్లా డోర్నకల్ సీఐ రాజేష్ నాయక్

Image
 *ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మహబుబాబాద్ జిల్లా డోర్నకల్ సీఐ రాజేష్ నాయక్*   *ఓ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు 50 వేల రూపాయల డిమాండ్*   *30 వేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు*

టిజి పి సి బి ద్వారా 3.24 లక్షలకు పైగా మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ

Image
  టిజి పి సి బి ద్వారా 3.24 లక్షలకు పైగా మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ *పర్యావరణ అనుకూలమైన మట్టి గణేష్ విగ్రహాలను ప్రోత్సహించే ప్రచార పోస్టర్లు  తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టిజిపిసిబి) ఆవిష్కరణ. *మట్టి గణేష్ విగ్రహాలపై మంత్రి శ్రీమతి కొండా సురేఖ పోస్టర్లను ఆవిష్కరించారు. హైదరాబాద్: 27-8-2025 నుండి ప్రారంభమయ్యే గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ప్రజలు మట్టి గణపతులను మాత్రమే పూజించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నుండి మట్టి విగ్రహాలకు మారాలని ఆమె ప్రజలను గట్టిగా కోరారు. ”మట్టి గణేష్ విగ్రహాలను తయారు చేసి ఇంట్లో మరియు మన నివాస ప్రాంతాలలో మట్టి గణేష్ విగ్రహాలకు పూజలు చేద్దాం. నీటి వనరులలో నుండి మట్టిని ఉపయోగిo చి మట్టి విగ్రహాలను తయారు చేసి పూజ చేసిన తర్వాత నీటి వనరులలోవాటిని తిరిగి నిమజ్జనం చేయలని” తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టిజిపిసిబి) మట్టి గణేష్ విగ్రహాలపై ప్రచార పోస్టర్లను శనివారం సచివాలయంలో విడుదల చేస్తూ మంత్రి సురేఖ అన్నారు. పూజలలో ఉపయోగించే పూలు మరియు మూలికలను కంపోస్ట్ చేయాలని మ...

ACB కి చిక్కిన ఒకే రోజు ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ లు

Image
  ACB కి చిక్కిన ఒకే రోజు ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ లు  ACB నెట్‌లో సబ్-రిజిస్ట్రార్, వనస్తలి పురం, రంగారెడ్డి జిల్లా  22.08.2025న AO-1 S. రాజేష్ కుమార్ సబ్ రిజిస్ట్రార్, వనస్తలిపురం రంగారెడ్డి జిల్లా, తెలంగాణ ACB, రంగారెడ్డి యూనిట్ వారు రూ. 1,00,000/- లంచం డిమాండ్ చేసి, ఫిర్యాదుదారుడి ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు A-2 K. రమేష్ r/o నాగోల్ ద్వారా ఫిర్యాదుదారుడి నుండి రూ. 70,000/- తీసుకున్నప్పుడు పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని A-2 నుండి అతని తరపున తిరిగి పొందారు. AO-1 S. రాజేష్ కుమార్ సబ్ రిజిస్ట్రార్, వనస్తలిపురం రంగారెడ్డి జిల్లా మరియు A-2 కె. రమేష్ r/o నాగోల్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. ************************************************ ఆదిలాబాద్ జిల్లా, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల విభాగం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జాయింట్-సబ్ రిజిస్ట్రార్-II ACB నెట్‌లో ఉన్నారు. 22.08.2025న, ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖలోని జాయింట్ సబ్-రిజిస్ట్రార్-II (AO) కె. శ్రీనివాస్ ర...

జాతీయ రక్తవీర్ పురస్కారాలు తెలంగాణ కి 4 అవార్డ్ రావడం సంతోషకరం - ఉప్పల శ్రీనివాస్ గుప్త

Image
 జాతీయ రక్తవీర్ పురస్కారాలు తెలంగాణ కి 4 అవార్డ్ రావడం సంతోషకరం - ఉప్పల శ్రీనివాస్ గుప్త అవార్డులను అందజేసిన లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్త ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని అశోక హోటల్ లో నిర్వహించిన జాతీయ రక్తవీర్ పురస్కారాల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ నుండి 4 గురుకి అవార్డ్ అందజేయడం జరిగింది. 1 ) Dr బాలు  2 ) గంప ప్రసాద్,పర్శ  3) వెంకటరమణ,  4 ) శివ కుమార్ లు ఈ అవార్డులను పొందడం జరిగింది. ఈ సందర్భగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ  తలసేమియా చిన్నారుల కోసం నాలుగు వేలకు పైగా రక్తాన్ని సేకరించి అందజేసినందుకు గాను జాతీయ రక్తవీర్ పురస్కారాన్ని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్త,ఐవిఎఫ్ అంతర్జాతీయ అధ్యకులు అశోక్ అగర్వాల్ చేతుల మీదుగా 4 గురికి అందజేయడం జరిగింది అని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైశ్యులు అందరిని ఏకం చేయడం కోసం ఐవిఎఫ్ పనిచేస్తున్నదని, ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఆనంద నిలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని దానికి ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చే...

రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్

Image
 *రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్* రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో తన అమ్మమ్మకు చెందిన భూమిని నమోదు చేసేందుకు, రికార్డుల్లో తప్పులను సవరించేందుకు ఒక వ్యక్తి వద్ద రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసిన *తహసీల్దార్ చింతకింది లలిత, సర్వేయర్ కోట రవి* బాధితుడి ఫిర్యాదు మేరకు రూ.50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Image
 నేడు జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా అధ్యక్షుడు తేలు కుంట్ల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది . ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి శెట్టి శ్రీనివాస్ కోశాధికారి జైని రాములు అదనపు ప్రధాన కార్యదర్శి నాళ్ల వెంకటేశ్వర్లు జిల్లా మహిళా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య జిల్లా ఎన్నికల అధికారి నల్లగొండ శ్రీనివాస్ బెస్ట్ సేవా సమితి వ్యవస్థాపకులు బుక్కా ఈశ్వరయ్య సీనియర్ జర్నలిస్టు కోటగిరి దైవాదినం పట్టణ అధ్యక్షులు యామ మురళి తేలుకుంట్ల జానయ్య సముద్రాల వెంకటేశ్వర్లువీరెళ్లి కృష్ణయ్య నాంపల్లి నరసింహా రేపాల భద్రాద్రి రాములు వీరెల్లి సతీష్ కోటగిరి రామకృష్ణపారపెల్లీ శ్రీనివాస్ బోనగిరి ప్రభాకర్ గుబ్బా శ్రీనివాస్ బోనగిరి కిరణ్ కుమార్ బోనగిరి కిరణ్ కుమార్ చెరుకు జానయ్య నూనె కిషోర్ కొత్త మాస్ ప్రభాకర్ కొత్త మాస్ నవీన్ కుకడం శ్రీనివాస్ వనమ రమేష్ పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో నల్లగొండ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి నాళ్ల శ్రీనివాస్ గారిని సన్మానించడం జరిగినది

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

Image
మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా హైద్రాబాద్: ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా పది సంవత్సరాల నుండి చెప్పుకుంటూ అప్రజాస్వామికంగా అరాచకంగా ఆ స్థానంలో ఉంటూ ఇటీవల కోర్టు తీర్పును సైతం ధిక్కరించి ఇప్పటికీ నేనే అధ్యక్షుడుని అని చింతల్ బస్తీలోని కార్యాలయంలో జాతీయ జెండా ని ఎగురవేయడానికి సిద్ధమైన అమరవాది లక్ష్మీ నారాయణ.    ఆర్యవైశ్య మహాసభ ప్రక్షలన కమిటీ నిరసనలతో జెండా ఆవిష్కరించకుండా పక్కకు తప్పుకున్న అమరవాది లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేష్ గుప్తా జెండా ఆవిష్కరించారు.   ఆర్యవైశ్య మహాసభ ప్రక్షలన కమిటీ ఆధ్వర్యంలో అమరావతి వెంటనే ఎన్నికలు పెట్టాలని కోర్టు తీర్పులు అమలు పరచాలని కోరుతూ నిరసన తెలపడంతో అమరవాది జాతీయ జండా ఆవిష్కరించకుండా తప్పుకున్నారు. ఆర్గనైజింగ్ సెక్రెటరీ గణేష్ గుప్తా జెండా ఆవిష్కరించారు. ఈరోజు ఉదయం  ప్రక్షణల కమిటీ ఆధ్వర్యంలో అమరవాది దిగిపోవాలి, కోర్టు తీర్పును వెంటనే అమలు పరచి ఎన్నికలు పెట్టాలని అమరవాది అధ్యక్షుడు కాదని నిరసనలు తెలపడంతో...

టీజీపీసీబీలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Image
  టీజీపీసీబీలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హైదరాబాద్, ఆగస్టు 15: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ)లో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సభ్య కార్యదర్శి  జి. రవి బోర్డు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మనకు లభించిన స్వేచ్ఛ అనేకమంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం, కృషి ఫలితం. వారి అంకితభావం, నిబద్ధత భవిష్యత్ తరాలకు మార్గదర్శకం. యువత వారు చూపిన దారిలో నడవాలి” అని అన్నారు. అలాగే, ఆరోగ్యవంతమైన, సమృద్ధి చెందిన సమాజ నిర్మాణం కోసం పర్యావరణ పరిరక్షణ అత్యంత కీలకమని ఆయన చెప్పారు. వ్యర్థాలను తగ్గించడం, నీటి సంరక్షణ, పర్యావరణానుకూల పద్ధతుల అమలు వంటి చర్యల్లో టీజీపీసీబీ పరిశ్రమలు, సంఘాలు, ప్రభుత్వ సంస్థలతో కలిసి చేస్తున్న కృషి పచ్చటి తెలంగాణ లక్ష్యానికి దోహదం చేస్తోందని వివరించారు. “స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తున్న ఈ సందర్భంలో, పర్యావరణాన్ని కూడా కాపాడటానికి మనం ప్రతిజ్ఞ చేద్దాం” అని పిలుపునిచ్చారు. మండలి సభ్యులు  సత్యనారాయణ, చీఫ్ ఇంజనీర్ బి. రఘు, అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు.

ACB అధికారులకు పట్టుబడిన కలెక్టర్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్

Image
 ACB అధికారులకు పట్టుబడిన కలెక్టర్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ Telangana ACB Update " ఫిర్యాదుధారుని తల్లి గారికి ప్రభుత్వం వారు ఇచ్చిన రెండు ఎకరాల భూమికి సంబంధించి, ఆమె పేరును చేర్చడం కోసం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత పత్రాలను ప్రాసెస్ చేయడానికి మరియు కలెక్టర్ జారీ చేసిన అధికారిక సందేశ ప్రతిని పాటుగా నవాబ్‌పేట తహశీల్దార్ వారి కార్యాలయానికి పంపడానికి" ఫిర్యాదుదారుని నుండి రూ.15,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ - కె. సుజాత.

నగరంలో గణేష్‌ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలి:జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్

Image
 *నగరంలో గణేష్‌ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలి:జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్  – ఉత్సవాల నిర్వహణకు నిధుల కొరత లేదు. – గతం కంటే ఘనంగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తాం హైదరాబాద్‌, ఆగస్ట్‌ 11, 2025: రానున్న గణేష్ ఉత్సవాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా , శాంతియుత వాతావరణంలో జరిగేలా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సహకారం అందించాలనీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ కోరారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 27 వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 6 వ తేదీన పూర్తి కానున్న గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కమిషనర్ అధ్యక్షతన సన్నాహక సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా *కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ...*  గత సంవత్సరం మాదిరి గానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరిగేలా జీహెచ్ఎంసీ, పోలీస్, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సహకారం అందిస్తుందని తెలిపారు. ఇప్పటికే నగర పరిధిలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నట్లు చె...

ఏసీబీ కి చిక్కిన ఇరిగేషన్ శాఖకు చెందిన మరొక అవినీతి అధికారి

Image
 ఏసీబీ కి చిక్కిన ఇరిగేషన్ శాఖకు చెందిన మరొక అవినీతి అధికారి  అలంపూర్ : ఇరిగేషన్ శాఖకు చెందిన మరొక అవినీతి మింగడం ఏసీబీ అధికారులు వేసిన వలలో చిక్కుకున్నాడు. రెండు రోజుల క్రితమే మహబూబ్ నగర్ ఇరిగేషన్ శాఖ ఏఈ ఒకరు ఏసీబీకి చిక్కగా గురువారం అలంపూర్ ఇరిగేషన్ శాఖ డీఈ శ్రీకాంత్ నాయుడు ఆర్డీఎస్ కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి రూ.11వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. ఎందుకు సంబంధించిన వివరాల ప్రకారం.. మూడు లక్షల రూపాయల కాంట్రాక్టు పనులకు సంబంధించి ఎం బి చేయడానికి డీఈ రూ. 12 వేలు లంచం డిమాండ్ చేసి.. 11000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సార్ పనులలో నష్టం వచ్చింది ఆ డబ్బులు ఇవ్వలేము అని చెప్పినప్పటికీ తప్పనిసరిగా మాకు మూడు శాతం కమిషన్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ మేరకు ఏసీబీ మహబూబ్ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో వారి బృందం డి కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా పటుకుని కేసు నమోదు చేశారు.

LRS తనిఖీ రిపోర్ట్ కొరకు లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ సహాయక కార్యనిర్వాహక ఇంజనీర్

Image
  LRS తనిఖీ రిపోర్ట్ కొరకు లంచం డిమాండ్ -  ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ సహాయక కార్యనిర్వాహక ఇంజనీర్  మహబూబ్నగర్:  "భూ నియంత్రణ పథకం (ఎల్.ఆర్.ఎస్) యొక్క అధికారిక అంతర్జాల సైట్‌లో ప్లాట్ కు సంబంధించిన సంయుక్త తనిఖీ రిపోర్ట్ మరియు ఎన్.ఓ.సి. ని పొందు పరచడానికి" ఫిర్యాదుధారుని నుండి రూ.3,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన మహబూబ్ నగర్ జిల్లా, ఒకటవ వలయంలోని డివిజన్-1, సబ్-డివిజన్-I యొక్క నీటిపారుదల సహాయక కార్యనిర్వాహక ఇంజనీరు - మహమ్మద్ ఫయాజ్. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.  "ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడుననీ ఏసీబీ అధికారులు తెలిపారు.

రూ.9 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌లను 40 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు అందజేసన వైఆర్ఫీ ఫౌండేషన్

Image
   రూ.9 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌లను 40 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు అందజేసన వైఆర్ఫీ ఫౌండేషన్  ఆగస్టు 6, 2025 వైఆర్ఫీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు ఛైర్మన్ యెలిశాల రవి ప్రసాద్ దూరదృష్టి నాయకత్వంలో, మాధాపూర్‌లోని వైష్ణోయ్ గ్రూప్ కార్పొరేట్ కార్యాలయంలో స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. మొత్తం రూ.9,00,000 విలువైన స్కాలర్‌షిప్‌లు 40 మంది అర్హత కలిగిన విద్యార్థులకు అందజేయడం జరిగింది, ఇది విద్య, సాధికారత మరియు సామాజిక అభివృద్ధిపై ఫౌండేషన్ యొక్క గాఢమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మానవ హక్కుల సంఘం (SHRC) ఛైర్‌పర్సన్ గౌరవనీయ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ముఖ్య అతిథిగా, ఎం. జగదీశ్వర్ IAS (రిటైర్డ్) గౌరవ అతిథిగా హాజరయ్యారు. వారు ఫౌండేషన్ ఎల్లప్పుడూ విద్యలో వెనుకబడిన విద్యార్థులకు అందిస్తున్న సహాయాన్ని ప్రశంసించారు. స్కాలర్‌షిప్ లబ్ధిదారులు ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, హై స్కూల్, ప్రాథమిక విద్య వంటి విభిన్న విద్యా శ్రేణుల నుండి వచ్చారు. వారు విద్యలో ప్రతిభ మరియు ఆర్థిక అవసరాల ఆధారంగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంతో ఫౌండేషన్ ఇప్పటివరకు త...

ఏసీబీ కి చిక్కిన మరి కొద్ది రోజుల్లో పదవి విరమణ పొందాల్సిన డీటీఓ

Image
  ఏసీబీ కి చిక్కిన మరి కొద్ది రోజుల్లో పదవి విరమణ పొందాల్సిన డీటీఓ   జగిత్యాల: జగిత్యాల జిల్లా రవాణా శాఖాధికారి బానోతు భద్రూనాయక్ రూ. 22 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో అధికారులు బాధితుని నుండి లంచం తీసుకుంటుండగా ట్రాప్ చేశారు.  జిల్లాలోని కోరుట్లకు చెందిన శశిధర్ అనే వ్యక్తికి జేసీబీ ఉండగా మోటార్ వెహికిల్ యాక్టు రూల్స్ ప్రకారం దానిని డీటీఓ సీజ్ చేశారు. జేసీబీతో పాటు ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడంతో కేసు నమోదు చేయవద్దని, జరిమానా విధించవద్దని, మొబైల్ తిరిగి ఇవ్వాలని శశిధర్ ప్రాధేయపడ్డాడు. రూ. 35 వేలు లంచంగా ఇస్తేనే కేసు బుక్ చేయనని, మొబైల్ ఫోన్ తిరిగి ఇస్తానని చెప్పడంతో డీటీఓ భద్రూనాయక్ డ్రైవర్ అరవింద్ ద్వారా బేరం మాట్లాడించాడు. చివరకు రూ. 22 వేలకు డీల్ కుదర్చుకోవడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డ్రైవర్ అరవింద్ ద్వారా లంచం తీసుకుంటుండగా భద్రూనాయక్ ను పట్టుకున్నామని, వీరిని కరీంనగర్ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. గతంలోనూ... మోటార...

బంజారా హిల్స్ అంబేద్కర్ నాలాలో ప్రమాదకర రసాయనాలు - చోద్యం చూస్తున్న కాలుష్య మండలి, జలమండలి

Image
  బంజారా హిల్స్ అంబేద్కర్ నాలాలో ప్రమాదకర రసాయనాలు - చోద్యం చూస్తున్న కాలుష్య మండలి, జలమండలి  Hyderabad:  నగరం నడిబొడ్డున తాజ్ బంజారా చెరువులోకి ప్రవాహం... బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లోని నూర్ నగర్ నుంచి డ్రైనేజ్, వరద నీటి లైన్లలో కలుషిత జలాలు.. ఎరుపు రంగులో నాలాలో నీటి ప్రవాహం. బెంబేలెత్తుతున్న జనం.. చోద్యం చూస్తున్న కాలుష్య మండలి, జలమండలి అధికారులు.

శ్రీయాన్ష్ ల్యాబ్స్ 2లో క్లోరిన్ గ్యాస్ లీకేజీ - వెంటనే స్పందించి స్టాప్ ప్రోడక్షన్ ఆర్డర్ ఇచ్చిన పీసీబీ

Image
 శ్రీయాన్ష్ ల్యాబ్స్ 2లో క్లోరిన్ గ్యాస్ లీకేజీ - వెంటనే స్పందించి స్టాప్ ప్రోడక్షన్ ఆర్డర్ ఇచ్చిన పీసీబీ మెదక్ జిల్లా 05.08.2025న ఉదయం 9:30 గంటలకు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం, కుచారం గ్రామం, కుచారం నెం. 228/9, ఇండస్ట్రియల్ పార్క్, కుచారం, ప్లాట్ నెం. 83 వద్ద ఉన్న మెస్సర్స్ శ్రీయాన్ష్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, యూనిట్ - 2లో క్లోరిన్ గ్యాస్ లీకేజి జరుగుతున్నదిని చుట్టుపక్కల పరిశ్రమల నుండి బోర్డుకు 05.08.2025న ఫిర్యాదు అందదంతో TGPCB యొక్క RO-RC పురం అధికారులు 05.08.2025న పరిశ్రమ మరియు పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. పరిశ్రమ డైరెక్టర్ 05.08.2025న ఉదయం 9:30 గంటల ప్రాంతంలో క్లోరిన్ సిలిండర్ నుండి క్లోరిన్ గ్యాస్ లీక్ అయిందని మరియు లీకేజీని దాదాపు 30 నిమిషాల్లో నియంత్రించామని అధికారులకు తెలియజేశారు.   లీకైన క్లోరిన్ సిలిండర్ చుట్టుపక్కల ప్రాంతంలో తీవ్రమైన క్లోరిన్ (CI) వాసన కనిపించిందినీ, పరిశ్రమ నీరు మరియు మట్టిని ఉపయోగించి లీకేజీని నియంత్రించారని. ఇసుకలో క్లోరిన్ జాడలు ఉండి చుట్టుపక్కల వాతావరణంలోకి వ్యాపించైనట్లు అధికారుల తనిఖీ లో కనుగొన్నారు.  పరిశ్రమ నిల్వ ప్ర...

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్ గా సినిమా నటుడు *రామ్ చరణ్ భార్య ఉపాసన

Image
 ☝️తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్ గా సినిమా నటుడు *రామ్ చరణ్ భార్య ఉపాసన* ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. 

ఉద్యోగం వస్తే..డీలర్ రాజీనామా చేయాల్సిందే - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ ;

Image
 ఉద్యోగం వస్తే..డీలర్ రాజీనామా చేయాల్సిందే పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్  రేషన్ డీలర్ కుటుంబాల్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తే..వాళ్ళు రేషన్ దుకాణం ను వదిలిపెట్టాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. సోమవారం నాడు ఆయన చింత పల్లి లో మాట్లాడుతూ..రేషన్ డీలర్ల కుటుంబాల్లో..ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన దాఖలాలున్నాయని,అలాంటి ఉదంతాల్లో డీలర్లు స్వచ్చందంగా రాజీనామ చేయడం మంచిదని సూచించారు. చౌక దుకాణాలు కేవలం ఒక ఉపాధి మార్గం అని రఘునందన్ వివరించారు.రేషన్ డీలర్ల కుటుంబాల్లో ఏ వ్యక్తి ఐనా..ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక ఐనా..లేదా ఇప్పటికే ఉద్యోగం వస్తే.. రేషన్ డీలర్షిప్ కు స్వచ్చంద రాజీనామ చేయడం శ్రేష్టం అని రఘునందన్ అన్నారు. స్వచ్ఛంద రాజీనామా చేయక పోతే..సమగ్ర విచారణ జరిపి "మీ ఉద్యోగి కుటుంబానికి రేషన్ దుకాణం కూడా ఉంది" గమనించగలరు అంటూ లేఖ రాసి నిజం చెప్పాల్సిన అగత్యం ఏర్పడుతుందని "మాచన" హెచ్చరించారు.

పెట్రోల్ లూజ్ సేల్స్ నిబంధనలకు విరుద్ధం

Image
 పెట్రోల్ లూజ్ సేల్స్ నిబంధనలకు విరుద్ధం పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్  మాచన రఘునందన్  పెట్రోల్ బంక్ యజమాన్యాలు బల్క్ లూస్ సేల్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.శనివారం నాడు ఆయన నాంపల్లి లో బి పి సి ఎల్ పెట్రోల్ బంక్ ను ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..కొన్ని పెట్రోల్ బంకు ల వాళ్లు డీజిల్, పెట్రోల్ ను ట్రాక్టర్ లో వచ్చిన డ్రమ్ముల్లో పోసి పంపిస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని రఘునందన్ అన్నారు. ఇంధనాన్ని విడిగా పెద్ద మొత్తం లో విక్రయిస్తే..పెట్రోల్ బంక్ యజమానులు ఇంధనాన్ని బ్లాక్ లో అమ్ముకుంటున్నారు అని జనం భావించే పరిస్థితి తలెత్తగలదని రఘునందన్ హెచ్చరించారు. పీపాల్లో ,డ్రమ్ము ల్లో పెట్రోల్ ,డీజిల్ ను పట్టుకు పోయిన వాళ్లు ఇంధనాన్ని అధిక ధరకు అమ్ముకునే అవకాశం లేకపోలేదని రఘునందన్ అభిప్రాయపడ్డారు.పెట్రోల్ పేలుడు పదార్థాల కేటగిరి లోకి వస్తుంది కాబట్టే..అగ్నిమాపక పరికరాలు, సాధనాలు ఉన్న ప్రాంగణం లో నే పెట్రోల్ ను అమ్మడం జరుగుతుందని రఘునందన్ వివరించారు.పెట్రోల్...

Acb నెలవారీ రౌండప్ - జూలై 2025 - మొత్తం 22 కేసులు

Image
 Acb నెలవారీ రౌండప్ - జూలై 2025 - మొత్తం 22 కేసులు హైదరాబాద్‌లోని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ జూలై - 2025 నెలలో మొత్తం 22 కేసులు/విచారణలు నమోదు చేసింది.  వీటిలో 13 ట్రాప్ కేసులు, 1 అసమాన ఆస్తుల కేసు, 1 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు, 1 రెగ్యులర్ ఎంక్వైరీ మరియు 6 ఆశ్చర్యకరమైన తనిఖీలు ఉన్నాయి. ఇద్దరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు/ప్రైవేట్ వ్యక్తులు సహా ఇరవై మంది ప్రభుత్వ ఉద్యోగులను ట్రాప్/అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.  వివిధ విభాగాల ట్రాప్ కేసుల్లో రూ.5,75,000/- మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.  అసమాన ఆస్తుల కేసులో, రూ.11,50,00,000/- విలువైన అసమాన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. RTA చెక్ పోస్టులు మరియు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలపై నిర్వహించిన ఆశ్చర్యకరమైన తనిఖీలలో, లెక్కల్లో చూపని రూ.1,49,880/- మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. జనవరి 2025 నుండి జూలై 2025 వరకు, బ్యూరో 148 కేసులను నమోదు చేసింది, అవి 93 ట్రాప్ కేసులు, 9 అసమాన ఆస్తుల కేసులు, 15 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 11 రెగ్యులర్ ఎంక్వైరీలు, 17 ఆశ్చర్యకరమైన తనిఖీలు మరియు 3 వివేకవంతమైన ఎంక్వైరీలు, పది మంది ...

కల్యాణ లక్ష్మి దరఖాస్తును ధృవీకరించడానికి రూ.4,000/- లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్

Image
 ఫిర్యాదుధారుని సోదరికి సంబంధించిన కల్యాణ లక్ష్మి దరఖాస్తును ధృవీకరించడానికి అతని నుండి రూ.4,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలపు రెవెన్యూ ఇన్స్పెక్టర్ - బాల సుబ్రహ్మణ్యం. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చుననీ, ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడుననీ ఏసీబీ అధికారులు తెలిపారు.

TGPCB ఆధ్వర్యంలో రెండు రోజుల మాస్టర్ ట్రైనర్స్ వర్క్‌షాప్‌

Image
  TGPCB ఆధ్వర్యంలో రెండు రోజుల మాస్టర్ ట్రైనర్స్ వర్క్‌షాప్‌ హైద్రాబాద్:  పర్యావరణ విద్య మరియు సామర్థ్య నిర్మాణంలో కొనసాగుతున్న కార్యక్రమాలలో భాగంగా, తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు (TGPCB) యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ni-msme)లో రెండు రోజుల మాస్టర్ ట్రైనర్స్ వర్క్‌షాప్‌ను విజయవంతంగా నిర్వహిస్తోంది. పర్యావరణ విద్యను వ్యాప్తి చేయడానికి మరియు వారి సంబంధిత సంస్థలలో స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడానికి అవసరమైన జ్ఞానం మరియు సాధనాలతో NSS అధికారులను శక్తివంతం చేయడం మరియు సన్నద్ధం చేయడం ఈ వర్క్‌షాప్ లక్ష్యం. ఇంటరాక్టివ్ సెషన్‌లు మరియు యాక్షన్-బేస్డ్ లెర్నింగ్ ద్వారా, పాల్గొనేవారు కీలకమైన పర్యావరణ సవాళ్లకు మరియు స్థిరత్వ లక్ష్యాలను సాధించడంలో సమాజ నిశ్చితార్థం యొక్క ఆవశ్యకతకు సున్నితంగా మారారు. ఈ కార్యక్రమం తెలంగాణ అంతటా వివిధ సంస్థల నుండి NSS ప్రోగ్రామ్ అధికారులను ఒకచోట చేర్చింది. వాతావరణ మార్పుల అవగాహన, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్థాల తగ్గింపు మరియు యువత నేతృత్వంలోని పర్యావరణ చర్యలు వంటి కీలక రంగాలలో సామర్థ్యాలను పెంపొంద...